పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శమంతకమణి పొందుట

వికీసోర్స్ నుండి

శమంతకమణి పొందుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శమంతకమణి పొందుట)
రచయిత: పోతన


(తెభా-10.2-48-వ.)[మార్చు]

అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె; సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి సేయ నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి హరి కిట్లనిరి.

(తెభా-10.2-49-క.)[మార్చు]

నా రాయణ! దామోదర!
నీ జదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా
ధా ణ! గోవింద! నమ
స్కా ము యదుపుత్త్ర! నిత్యల్యాణనిధీ!

(తెభా-10.2-50-మ.)[మార్చు]

ది విజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా
వంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా
దీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై
వియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్.

(తెభా-10.2-51-వ.)[మార్చు]

అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు.

(తెభా-10.2-52-క.)[మార్చు]

రా జేలెడు వసుమతి
నా త్నము పూజ్యమానగు నక్కడ రో
గా రిష్ట సర్వ మాయిక
మా రీ దుర్భిక్ష భయము మాను; నరేంద్రా!

(తెభా-10.2-53-క.)[మార్చు]

మ్మణి యాదవ విభునకు
ని మ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం
బొ మ్మని పలికెను, జక్రికి
ని మ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:17, 12 డిసెంబరు 2016 (UTC)