ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/వెన్నెలకంటి అన్నయ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వెన్నెలకంటి అన్నయ


ఇతఁడు "షోడశకుమారచరిత్రము"ను రచించెను. దీనికి "బేతాళపంచవింశతి" అను నామాంతరము కలదు. బేతాళపంచవింశతి కవిభల్లట రచనగా లాక్షణికులు చెప్పుచున్నారు. ముద్రిత షోడశకుమారచరిత్రములోని భాగములను, ఆముద్రిత బేతాళ పంచవింశతి లోని భాగములను అభిన్నములయి యున్నవి

అన్నయ తన గ్రంధమును తండ్రియగు సూరనామాత్యుని కంకిత మిచ్చెను. సూరనామాత్యుని, పశ్చిమ చాళుక్య చక్రవర్తియగు సోమేశ్వరుని (క్రీ. శ. 1128-1138) తోడను, జగదేక మల్లుని (క్రీ. శ. 1148) తోడను. కృష్ణకందారుఁ డను యాదవరాజు (క్రీ. శ. 1250) తోడను, కవి పోల్చి యుండుటచే నీతఁడు క్రీ. శ. 1250 ప్రాంతమువాఁడయి యుండవచ్చునని. 'తెనుఁగు కవుల చరిత్ర' లోఁ దెలుపఁబడి యున్నది.