పీఠిక.
5
బ్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.”
--పద్యమునందు “కర్ణాటకటక పద్మవనహేళి” (కర్ణాటదేశపట్టణము --కమలములకు సూర్యుఁడు) అను విశేషణమును శ్రీనాథుఁడు దనకుఁ కూర్చుకొనియున్నందునను.
భీమేశ్వరఖండములో.
"ప్రౌడ పరికింప సంస్కృతభాష యండ్రు
పలుకునుడికారమున నాంధ్రభాషయందు
రెవ్వరేమన్న నండ్రు నా కేమి కొఱత
నా కవిత్వంబు నిజము కర్ణాటభాష.”
-- పద్యములో “నాకవిత్వంబు నిజము కర్ణాటభాష” యని తనకుఁ కర్ణాటభాషయందుఁ గల ప్రేమను సూచించియున్నందునను.-
ఆభీమఖండములోనే.-
"కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరు౯
ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిఫు౯
వినమజ్జ్యాంతరసార్వభౌము: గవితావిద్యాధరుం గొల్తు నా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్.”
--పద్యమునందు శ్రీనాథునిపితామహుడును బద్మపురాణగ్రంథ నిర్మాణాలంకర్మీణుఁడును కవితావిద్యాధురంధరుండును నగుకమలనాభామాత్యగ్రామణి పశ్చిమసముద్రతీరమునఁ గర్ణాటదేశములోఁ జేరిన కాల్పట్టమునకుఁ బ్రభువుగా నున్నట్లు చెప్పియున్నందునను.
శ్రీనాథుని వీధినాటకములో-
"కుళ్ళాయుంచితిఁ గోక సుట్టితి మహాకూర్బాసముం దొడ్గితి౯
వెల్లుల్లి౯ దిలపిష్టము౯ బిసికితి౯ విశ్వస్త వడ్డింపఁగాఁ
జల్లాయంబలి త్రావితి౯ రుచులు దోసంబంచుఁ బోనాడితి౯
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయ లేదా నేను శ్రీనాథుఁడన్."
-- పద్యమునఁ " దల్లీ! ” యని కర్ణాటదేశమును సంబోధించినందునను