పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై కథా సందర్భములనుపట్టి చూడగా, యథా వాల్మీకమని వరదరాజు వ్రాసినను, తనకు ముందుగానే వెలసిన రామా యణములయందు పై కథలుండుట చేతను నవి ప్రజల యాదరణకుఁ బాత్రనులగుట చేతను, నాతఁడు, నేడ వాల్మీకములని యనుకొనుచున్న వానిని గూడ తన గ్రంథ మునఁ జేర్చెనని యూహింపదగియున్నది. అవి కావ్యమునకు శోభ గూర్చినవేగాని, వేఱువిధముగా లేవని పాఠకలోక మున కీవఱకు పరిచితమే.

వరదరాజుయొక్క యాంధ్రీ కరణ రీతీని జూపుట కీదిగువ కొన్ని శ్లోకములను వాని ద్విపదలను నొసంగుచున్నాను.

ధ్వతిప్రవాళ ప్రసహాగ్ర్యపుష్పస్త పోబల శ్శౌర్యనిబద్దమూలః
రణే మహాన్ రాక్షసరాజవృక్ష స్సమ్మర్దితో రాఘవమారుతేన
తేజోవిషాణః కులవంశవంశః కోపప్రసాదాపర గాత్రహస్త
ఇక్ష్వాకుసింహావగృహీత దేహస్సుప్తః క్షితో రావణగంధహస్తే
పరాక్రమోత్సాహ విజృంభితార్చిర్నిశ్వాస ధూమస్వబల ప్రతాపః
ప్రతాపవాన్సంయతి రాక్షసాగ్నిర్నిర్వాపితో రామపయోధ రేణ


"ధైర్యమ్మునిగుడ మొత్తము నసమాన
శౌర్యంబు పేరును శారీరబలము
ప్రసవసంపదయుఁ దపశ్శక్తిపేర
నెసగుచేవయుగల్గి నీవనునట్టి
సంపూర్ణ ఫలమహీజము రాముపేరి
ఝంపాసమీరమిచ్చటఁ గూలఁద్రోచె.
క్రోధగాత్రము కాంతగుణతుండ మహిత