నారాయణీయము/దశమ స్కంధము/52వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

52వ దశకము - బ్రహ్మకృతవత్సాపహరణము

52-1
అన్యావతారనికరేష్వనిరీక్షితం తే
భూమాతిరేకమభివీక్ష్య తదాఘమోక్షే।
బ్రహ్మా పరీక్షితుమనాః స పరోక్షభావం
నిన్యే౾థ వత్సకగణాన్ ప్రవితత్య మాయామ్॥
1వ భావము :-
     భగవాన్! అఘాసురుని సంహరించి ఆ రాక్షసునికి మోక్షమునొసగుటలో, బ్రహ్మదేమునికి నీ ఇతర అవతారములలో కనిపించని విలక్షత కనిపించినది. బాలునిరూపముననున్న నిన్ను పరీక్షించి నీ మహత్యమును (మరియొకసారి) వీక్షించవలెనని నిశ్చయించుకొనినవాడై, బ్రహ్మ తన శక్తితో మీ గోమందలను అదృశ్యముచేసెను.

52-2
వత్సానవీక్ష్య వివశే పశుపోత్కరే తాన్
ఆనేతుకామ ఇవ ధాతృమతానువర్తీ।
త్వం సామిభుక్తకబలో గతవాంస్తదానీం
భుక్తాంస్తిరో౾ధిత సరోజభవః కుమారాన్॥
2వ భావము:-
  గోవులు (ఆకస్మికముగా) కనిపించక పోవుటతో గోపబాలురు ఆందోళనచెందిరి. స్వయముగా నీవే వాటిని వెదికి తేవలెనని నిశ్చయించితివి; మీరప్పుడు భోజనము చేయుచుండిరి. వాస్తవమునకు, బ్రహ్మదేముని కోరికతీర్చుటకా అనునట్లు, ప్రభూ! సగముతినిన అన్నకబళమును అరచేతిలో పట్టుకొని, నీవు ఆ గోవులను వెదుకుటకు బయలుదేరితివి. పద్మసంభవుడు ఆ గోపబాలురను సహితము మాయము చేసెను.

52-3
వత్సాయితస్తదను గోపగణాయితస్త్వం
శిక్యాదిభాండమురళీగవలాదిరూపః ।
ప్రాగ్వత్ విహృత్య విపినేషు చిరాయ సాయం
త్వం మాయయా౾థ బహుధా వ్రజమాయయాథ॥
3వ భావము:-
  ప్రభూ! అట్లు జరుగగనే అది 'బ్రహ్మదేముని మాయ' అని గ్రహించితివి. తక్షణమే - నీవే గోమందలుగను, గోపబాలకులుగను, వారు తెచ్చిన 'మట్టి పాత్రలు', అవి పెట్టితెచ్చిన 'ఉట్లు' రూపములుగను; వారు ధరించిన వేణువులు, కొమ్ముబూరల ఆకృతులను పొందితివి. ఆ మాయాబాలురతో - గోవులతో చాలాసమయము ఆ వనములో విహరించి వారితో కలిసి వ్రేపల్లెకు తిరిగి వచ్చితివి.

52-4
త్వామేవ శిక్యగవలాదిమయం దధానో
భూయస్త్వమేవ పశువత్సకబాలరూపః।
గోరూపిణీభిరపి గోపవధూమయీభిః
ఆసాదితో౾సి జననీభిరతిప్రహర్షాత్॥
4వ భావము:-
  భగవాన్! అందరూ నీవే అయి - నీవే సృష్టించిన 'ఉట్లు, కొమ్ము బూరలు' ధరించి- అందరి రూపమున - గోపబాలురు మరియు గోవులుగా, నీవు ఒక్కడివే ( గోధూళివేళకు) బృందావనమును చేరితివి. గోపాలుర రూపమున ఉన్న నిన్నుచూచి ఆ గోపాలుర - తల్లులు అత్యంతానందముతోను, మిక్కిలి ప్రేమతోను నిన్ను చేరదీసిరి.

52-5
జీవం హి కంచిదభిమానవశాత్ స్వకీయం
మత్వా తనూజ ఇతి రాగభరం వహంత్యః।
ఆత్మానమేవ తు భవంతమవాప్య సూనుం
ప్రీతిం యయుర్న కియతీం వనితాశ్చగావః॥
5వ భావము:-
ప్రాణులు తమసంతానమును అనురాగముతో చేరదీయుట, చూచినతోడనే ఆనందపడుట అనునవి లోకసహజము. అట్టి ప్రాణులకు - ఆ పరమాత్మే తమ బిడ్డ రూపముతో వచ్చినచో ప్రభూ! వారు ఇంకెంత ఆనందమును పొందుదురో కదా! తమ గోపబాలకుని రూపముతో దరిజేరిన నిన్ను చూచి ఆ గోపస్త్రీలు అవ్యక్త అలౌకిక ఆనందమునకు లోనయిరి.

52-6
ఏవం ప్రతిక్షణవిజృంభితహర్షభార-
నిశ్శేషగోపగణలాలితభూరిమూర్తిమ్।
త్వామగ్రజో౾పి బుబుధే కిల వత్సరాంతే
బ్రహ్మత్మనోరపి మహాన్ యువయోర్విశేషః॥
6వ భావము:-
  ప్రభూ! ఈ విధముగా ఒక సంవత్సర కాలము గడిచెను. గోపజనులు తమ బిడ్డల రూపమున ఉన్న నిన్ను (తమబిడ్డేయని అనుకొని) లాలించుచు ప్రతీక్షణము ఆనందించుచుండిరి. నీ అన్న బలరామునకు సహితము ఈ విషయము సంవత్సరాంతమున మాత్రమే తెలిసెను. మీరిరువురును పరబ్రహ్మస్వరూపులే అయిననూ నీవు మాత్రము ప్రత్యేకముగానుంటివి.

52-7
వర్షావధౌ నవపురాతనవత్సపాలాన్
దృష్ట్వా వివేకమసృణే ద్రుహిణే విమూఢే।
ప్రాదీదృశః ప్రతినవాన్ మకుటాంగదాది-
భూషాంశ్చతుర్భుజయుజః సజలాంబుదాభాన్॥
7వ భావము:-
  సంవత్సరాంతమున - బ్రహ్మదేముడు తను మాయంచేసిన గోవులను, గోపబాలురును -( ఏక రూపమున నీచే సృష్టించ బడిన) కొత్త గోవత్సములును గోపబాలురును, వేరుచేసి గుర్తించలేక మూఢుడయ్యెను. అప్పుడు - నీచే సృజించబడిన గోపాలురును గోవులును విడదీసి బ్రహ్మదేమునికి చూపించితివి. ఆహా! ప్రభూ! ఏమి అద్భుతమిది. వారందరు నీలమేఘచ్ఛాయతో -చతుర్భుజములతో - భుజకీర్తులతో, కిరీటము మొదలగు అలంకారములతో నీవలెనే కనిపించిరి.

52-8
ప్రత్యేకమేవ కమలాపరిలాలితాంగాన్
భోగీంద్రభోగశయనాన్ నయనాభిరామాన్।
లీలానిమిలీతదృశః సనకాదియోగి
వ్యాసేవితాన్ కమలభూర్భవతో దదర్శ॥
8వ భావము:-
  భగవాన్! పద్మసంభవుడగు బ్రహ్మదేమునికి నీదివ్య రూపమును ఆ గోపబాలురలలో సాక్షత్కరింపజేసితివి; వారిలో నీరూపము - లక్ష్మీదేవి పరిచర్యలు చేయుచుండగా - అర్ధనిమీలిత నేత్రములతో - నీవు ఆదిశేషునిపై శయనించి ఉన్నట్లు కనిపించినది. సనకాది మహామునులు సహితము నిన్ను సేవించుచున్నట్లుగా కనిపించిన, ఆ నీ రూపములు దివ్యసౌందర్య కాంతులతో ప్రకాశించుచుండెను.

52-9
నారాయణాకృతిమసంఖ్యతమాం నిరీక్ష్య
సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్య ధాతా।
మాయానిమగ్నహృదయో విముమోహ యావత్
ఏకో బభూవిథ తదా కబలార్ధపాణిః॥
9వ భావము:-
  అసంఖ్యాకముగా ఉన్న ఆ నారాయణరూపములను తానే సేవించుచున్నట్లుగా బ్రహ్మదేముడు చూచెను. నీ మాయ పూర్తిగా ఆవరించి ఉండుటచే బ్రహ్మదేముడు ఏమియును తెలుసుకొనలేకపోయెను. భగవాన్! నీవు బ్రహ్మను అనుగ్రహించి, వెనువెంటనే, సగము తినుచున్న అన్నపుముద్దను చేతియందుధరించి ఒకేఒక గోపబాలునిగా - బాలకృష్ణునిగా కనిపించితివి.

52-10
నశ్యన్ మదే తదను విశ్వపతిం ముహుస్త్వాం
నత్వా చ నూతవతి ధాతరి ధామ యాతే।
పోతైస్సమం ప్రముదితైః ప్రవిశన్ నికేతం
వాతాలయాధిప।విభో।పరిపాహిరోగాత్॥
10వ భావము:-
  ప్రభూ! మదము నశించగా బ్రహ్మదేముడు విశ్వాధిపతివయిన నీకు నమస్కరించి, నిన్ను మరల మరల స్తుతించుచూ తనస్థానమునకు వెడలెను. నీవు నీతోటి గోపబాలురతో కలిసి ఆనందముగా గృహము చేరితివి. అట్టి విభో! గురవాయూరుపురాధీశా! నారోగమును హరించుము - అని ప్రార్థించున్నాను.

దశమ స్కంధము
52వ దశకము సమాప్తము.
-x-