దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువయోధ్యై

వికీసోర్స్ నుండి
ముఖచిత్రం

98. తిరువయోధ్యై - 3

శ్లో. భాతి శ్రీ సరయూ సరిత్తట గతే శ్రీ మానయోధ్యా పురే
   శ్రీ మత్పుష్కల దేవయాన నిలయ సత్యాఖ్య కాసారకే|
   సీతాలిజ్గిత మూర్తిరుత్తర ముఖ శ్రీ రామ నామా హరి
   స్త్వాసీనో భరతాభిర్ముని గణైర్దేవ్యైచ దృష్ట స్సదా||
   పరాంకుశ కలిధ్వంస కులశేఖర సూరిభి:
   విష్ణుచిత్తేన మునినా మంగళై రభి సంస్తుత:||

వివ: శ్రీరామచంద్రులు (రఘునాయకన్)-సీతాదేవి-సరయూనది-పుష్కల విమానము-సత్యపుష్కరిణి-ఉత్తరముఖము-కూర్చున్నసేవ-భరతునకు దేవతలకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్-కలియన్-కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-తొండరడిప్పాడి యాళ్వార్ కీర్తించినది.

విశే: ముక్తిప్రదక్షేత్రములలో నొకటిగా కీర్తింపబడినది. సరయూనదికి సమీపమున శ్రీరంగనాథుల సన్నిథి కలదు. ఇచట దక్షిణ దేశ అర్చక స్వాములు గలరు.

తిరునక్షత్ర తనియన్:
       చైత్రమాసే సితే పక్షే నవమ్యాంచ పునర్వసౌ
       మధ్యాహ్నే కర్కటేలగ్నే రామోజాత స్స్వయంహరి:

మార్గము: కాశి-వారణాసి-లక్నో రైలుమార్గంలో పైజాబాద్ స్టేషన్‌లో దిగి బస్‌లో 10 కి.మీ వెళ్ళి ఈ క్షేత్రం చేరవచ్చును. ఇచట అన్ని సౌకర్యాలు కలవు.

పా. అజ్గణెడుమదిళ్ పుడై శూழ் యోత్తి యెన్ఱుమ్‌
          అణినగరత్తులగునై త్తుమ్‌ విళక్కు-ది
   వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్‌తోన్ఱి
          విణ్‌ముழுదు ముయ్యకొణ్డ వీరన్ఱన్నై
   శెజ్గణెడుమ్‌ కరుముగిలై యిరామన్ఱన్నై
          త్తిల్లై నగర్ తిరుచిత్తర కూడన్దన్నుళ్
   ఎజ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
          యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే.
          కులశేఖరాళ్వార్-పెరుమాళ్ తిరుమొழி 10-1

132

99. నైమిశారణ్యం - 4

శ్లో. దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే |
   పుండరీక లతా నాధో దేవరాజాహ్వయో హరి:||
   విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియ:|
   దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్ష: కలిజిన్నుత:||

వివ: దేవరాజన్-పుండరీక వల్లి-దివ్య విశ్రాంత తీర్థము-శ్రీహరి విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-దేవర్షులకు ఇంద్రునకు-సుధర్మునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచట మఠములు, రామానుజ కూటములు కలవు. వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని యిచటలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు గలవు. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు గలవు.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పెనట. ఆపడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు అష్టాదశ పురాణములను వినిపించెను.

మార్గము: లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి. <poem> పా. వాణిలాముఱవల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే

  పేణినేన్; అదవై ప్పిழைయెనక్కరుది ప్పేదై యేన్‌పిఱవినో యఱుప్పాన్
  ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళై యవర్ కలవియిన్దిఱత్తై
  నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; నైమిశారణియత్తుళెన్దాయ్.
        తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-6-1
</
poem>
                                             133