దివ్యదేశ వైభవ ప్రకాశికా/నైమిశారణ్యం

వికీసోర్స్ నుండి

99. నైమిశారణ్యం - 4

శ్లో. దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే |
   పుండరీక లతా నాధో దేవరాజాహ్వయో హరి:||
   విమానం శ్రీ హరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియ:|
   దేవర్షీంద్ర సుధర్మాక్షి ప్రత్యక్ష: కలిజిన్నుత:||

వివ: దేవరాజన్-పుండరీక వల్లి-దివ్య విశ్రాంత తీర్థము-శ్రీహరి విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-దేవర్షులకు ఇంద్రునకు-సుధర్మునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇచట మఠములు, రామానుజ కూటములు కలవు. వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని యిచటలేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు చెప్పుదురు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు గలవు. సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు గలవు.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పెనట. ఆపడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు అష్టాదశ పురాణములను వినిపించెను.

మార్గము: లక్నో - బాలాము మధ్యగల శాండిలా స్టేషన్‌కు 35 కి.మీ. కలకత్తా-డెహ్రాడూన్ రైలు మార్గములో బాలమార్ జంక్షన్ నుండి సీతాపూర్ రైలులో నైమిశారణ్యం స్టేషన్. అక్కడ నుండి 3 కి.మీ. బండిలోగాని నడచిగాని వెళ్లవచ్చును. అహోబిల మఠం రామానుజ కూటం ఉన్నాయి. <poem> పా. వాణిలాముఱవల్ శిఱునుదల్ పెరున్దోళ్; మాదరార్ వనములైప్పయనే

  పేణినేన్; అదవై ప్పిழைయెనక్కరుది ప్పేదై యేన్‌పిఱవినో యఱుప్పాన్
  ఏణిలే నిరున్దే నెణ్ణినే నెణ్ణి; యిళై యవర్ కలవియిన్దిఱత్తై
  నాణినేన్ వన్దున్ తిరువడి యడైన్దేన్; నైమిశారణియత్తుళెన్దాయ్.
        తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-6-1
</
poem> 133

100. శాళక్కిఱామం (సాలగ్రామమ్‌) - 5

శ్లో. గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||

వివ: శ్రీమూర్తి పెరుమాళ్-శ్రీదేవి తాయార్-గండకీ నది-చంద్ర తీర్థము-కనక విమానము-ఉత్తరముఖము-నిలచున్నసేవ- గండకీ అనువేశ్యకు-శివునకు-బ్రహ్మకు ప్రత్యక్షము-పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: స్వయం వ్యక్తక్షేత్రము. నేపాల్ దేశమున గలదు. ఖాట్మండుకు 175 మైళ్ల దూరమున గల ముక్తినాధ్‌క్షేత్రమే సాలగ్రామము.(ఖాట్మండుకు 65 మైళ్ల దూరమున గల దామోదర కుండమే సాలగ్రామమని కొందరి అభిప్రాయము)గండకీనది జన్మస్థానము. ఈనదిలోనే మనము ప్రతినిత్యము ఆరాధన చేయు సాలగ్రామములు లభించును.

మార్గము: నేపాల్ రాజధాని ఖాట్మండుకు 100 కి.మీ.

పా. కలై యుమ్‌ కరియుమ్‌ పరిమావుమ్; తిరియుమ్‌ కానమ్‌ కడన్దుపోయ్,
   శిలై యుమ్‌ కణై యుమ్‌ తుణై యాగ; చెన్ఱాన్ వెన్ఱిచ్చెరుక్కళత్తు;
   మలై కొణ్డలై నీరణై కట్టి; మదిళ్ నీరిలజ్గై వాళరక్కర్
   తలై వన్, తరై పత్తుఱత్తుగన్దాన్; శాళక్కిరామ మడై నె--.
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-5-1


మంచిమాట

ఒకనాడు ఒక శ్రీవైష్ణవులు నంబిళ్ల గారిని ఇట్లు అడిగిరి. "కాకాసురుడు పాదములపైబడి శరణువేడినను శ్రీరామచంద్రమూర్తి ఆతని కంటి నొకదానిని పోగొట్టెను గదా! కావున శరణాగతుడైనను పూర్వకర్మను అనుభవించియే తీరవలెనా? "సాధ్య భక్తి స్తు:సాహన్త్రీ ప్త్రారబ్ధస్యాపి భూయసీ" అనునట్లు సాధ్య భక్తి ప్రారబ్ధమును కూడ పోగొట్ట వలదా! అందుకు నంబిళ్లైగారి సమాధానము, "నిజమే, కానీ అంతటి అపరాధియైన కాకాసురుని క్షమించి విడిచిన దానికి గుర్తుగా అట్లు చేరి. అంతేకాదు రెండు కళ్లతో చేయు పనిని ఒక్కకంటితోనే చేయగల ఉపకారమును సైతము చేసిరి కావున అది దండించుటయు కాదు."

                                            134