దివ్యదేశ వైభవ ప్రకాశికా/తలైచ్చంగనాణ్మదియమ్‌

వికీసోర్స్ నుండి

13. తలైచ్చంగనాణ్మదియమ్‌ 13

(తలైచ్చగాండ్రు)

శ్లో. శ్రీ చంద్రాహ్వయ పద్మినీ తటతలే శ్రీ మత్తలచ్చజ్గమి
   త్యాఖ్యే దివ్య పురేతు చంద్ర పదకే వైమాన వర్యే స్థిత:|
   దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా
   ప్రాగాస్య శ్శశి దేవ సేవిత తను శ్శార్జ్గాంశ మౌని స్తుత:||

వివ: నాణ్మదియప్పెరుమాళ్-వెణ్ శుడర్ పెరుమాళ్-తలైచ్చంగ నాచ్చియార్-శెంగమలవల్లి తాయార్-చంద్ర పుష్కరిణి-చంద్ర విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు అరుణ వనమని పేరు కలదు.

మార్గము: మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ దూరమున సన్నిధి కలదు తలచ్చంగాడనియే చెప్పాలి. తలచ్చంగాడు నుండి మణ్‌శాలై పోవు మార్గంలో 1/4 కి.మీ దూరమున సన్నిధి కలదు. వసతులు మితముగా నున్నవి.

   కణ్ణార్ కణ్ణపుర జ్కడిగై కడి కమழுమ్;
   తణ్ణార్ తామరై శూழு తలైచ్చజ్గమే త్తిశైయుళ్;
   విణ్ణోర్ నాణ్మదియై విరిగిన్ఱి వెంజుడరై
   కణ్ణార కణ్డు కొణ్డు కళికిన్ఱ దిజ్గెన్ఱు కొలో.
         తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 8-9


అష్టవిధ భక్తి

1. మద్బక్తజన వాత్సల్యమ్_____________భగవద్బక్తుల యందు ప్రేమ
2. పూజాయాంచ అనుమోదనం__________భగవదారాధన యందు కోరిక
3. స్వయం అభ్యర్దనమ్_______________స్వయముగా ఆరాదించుట
4. మదర్దే డంబవర్జనమ్_______________భగవద్విషయమున ఆడంబరములను విడుచుట
5. మత్కధాశ్రవణే భక్తి________________భగవంతుని కథలను వినుటయందు భక్తి
6. సర్వ నేత్రాంగ విక్రియా_____________భగవత్కథలను వినునపుడు శరీరముపులకించుట
7. మమానుస్మరణం నిత్యం____________ఎల్లపుడు భగవంతుని తలచుట
8. యచ్చమాం నోవజీవతి_____________ప్రయోజనాంతరముల యందు ఆశలేకుండుట

12. సారనాథన్-తిరుచ్చేరై బొమ్మ

Saranathan - Tirucherai

13.నాణ్మదియప్పన్-తిరుచ్చంగనాణ్మదియమ్‌ బొమ్మ

Nanmadiyappan-Talachangada

14.A. ఆరావముదన్-తిరుకుడందై (కుంభకోణం)

Aravamudan - Kumbhakonmam

14. తిరుక్కుడందై 14

కుంభకోణము

శ్లో. శ్రీ హేమాంబుజినీ తటీ తు నగరే శ్రీ కుంభఘోణాభిదే
   ప్రాప్త:కోమల వల్లికాఖ్య మహిషీం శ్రీవైదికా గారగ:|
   హేమాఖ్యాన మునీక్షితో విజయతే శ్రీ శార్జ్గా పాణి ప్రభు:
   ప్రాగాస్యో భుజగేంధ్ర భోగశయనోతృప్తామృతాఖ్యాయుత:||


శ్లో. శ్రీ భూత మహదాఖ్యాన భక్తి సార శఠారిభి:|
   విష్ణుచిత్త కలిఘ్నాఖ్యాం గోదాస్తుతి పరిష్కృత:||


వివ: శార్జ్గ పాణి పెరుమాళ్-ఆరావముదు పెరుమాళ్-కోమలవల్లి తాయార్-హేమపుష్కరిణి-వైదిక విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనమున ఉత్థాన శయనము పూదత్తాళ్వార్;పేయాళ్వార్; తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. హేమమహర్షికి ప్రత్యక్షము.


విశే: ఈ దివ్యదేశమున ఈ సన్నిధి కాక చక్రపాణి పెరుమాళ్ సన్నిధి; రామర్, వరాహనాయనార్ సన్నిధులు గలవు. బ్రహ్మాలయము, సూర్యాలయము కలవు. తిరుమழிశై ఆళ్వార్ తిరునాడు అలంకరించిన (పరమ పదించిన) స్థలము. శార్జ్గ పాణి పెరుమాళ్ సన్నిధికి పడమట వీరికి సన్నిధి గలదు. మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగును.


ఈ క్షేత్రమునకు కుడమూక్కు (కుంభ ఘోణం) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వారు తిరువాయిమొழிలో "ఆరావము"తే యను దశకమున (5-8) ఆరావముతే (ఆతృప్తామృతమా! అనగా ఎంత సేవించినను అనుభవించినను తనివి తీరక ఇంకను అనుభవింపవలెనను కోరిక కలుగునట్లు వేంచేసియున్నవాడా!) అని కీర్తించియున్నారు. అంతియేకాక "శూழ்విశుమ్" అను తిరువాయిమొழிలో (10-9) తమ పరమ పదానుభవమును ప్రకటించుచు భూలోకస్మరణ ప్రసక్తియే లేని సందర్భమున కూడ "కుడన్దై యెజ్గోవలన్" అని కుంభఘోణక్షేత్రమును కీర్తించిరి. అట్లే తిరుమజ్గై యాళ్వారును తమ ప్రబంధములలో మొదటిదగు పెరియ తిరుమొழி ప్రారంభములో "ఆవియే యముదే" అనుపాశురమున (పె.తి.1-1-2) శూழ்పునల్ కుడన్దైయే తొழுదు" (జలాశయ పరివృతమైన కుంభఘోణక్షేత్రమునే సేవించి) యని మొట్ట మొదట కుంభఘోణక్షేత్రమునే ప్రస్తుతించిరి. అంతియే కాక తమ ప్రబంధములలో చివరిదగు "తిరునెడున్దాణ్డగ"మున "తణ్కుడన్దక్కిడన్దమాలై" యని ఈ క్షేత్రమునే ప్రస్తుతించి ముగించిరి.