జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 5

వికీసోర్స్ నుండి

చేతగాని చెడిపోయే పిల్లలకున్ను, మాత్రమే ఈ కింటర్ గార్టెన్ బడులు పనికి వస్తవి. ఆరేళ్ల లోపు పిల్లల యెదుట దేశ పటములుంచి వ్రాత, చదువులను నేర్పి, వారి మనస్సులలో ఆయా విషయములను క్రుక్కకూడదు. ఆయా ఆటలను ఉపాధ్యాయినులే ఏర్పాటు చేయవలెను. అని సాధారణముగా పిల్లలు బడులలోను బయటను చూచేవిగానె ఉండవలెను.

పిల్లల మొత్తము సంఖ్యలో నూటికి ఇరవై ఇద్దరు ఈ కింటర్ గార్టెన్ బడులలో చదువు కుంటారు. కాని, ఈ బడులలో చదువుకొనే పిల్లల కంటే, ఇంటివద్ద చదువుకొనే పిల్లలే ఎక్కువ తెలివి తేటలుగలవారని తెలియవస్తున్నది.

ఆధ్యాయము. 5

"గ్రుంట్ షూలె లేక ఐన్ హేట్ షూలె"

.

సాధారణ పాఠశాలలు

జర్మను దేశమంతే ఏకముగా ఉండవలెనంటే, ధనికులు పేదలు అనే భేదము లేకుండా అందరికీ సాధారణముగా బడులు ఉండవలెననిన్నీ కొద్ది కాలములో ప్రారంభ విద్యనుంచి కళశాల విద్యవరకు విద్య అంతా జర్మను జనుల కందరికీ సామాన్యముగా ఉండగలదనిన్నీ, 1848 సం. రములో సేవెర్ను అనే రాజకీయ వేత్త పలికినాడు. మొన్నటి యుద్ధ సమయములో అనేక అంతేరువుల మనుష్యులు సైనికులుగా ఒకరితో ఒకరు కలియవలసి వచ్చినది. అప్పటినుంచి ఆయా అంతరువుల మనుష్యులకు ఇంకా దగ్గర సాంఘిక సంబంధము కుదురు కోవలసినదనే అభిప్రాయము దృఢపడినది. జర్మను చక్రవర్తి అయిన కెయిజరు ఇరావైయారు రాష్ట్రములను జర్మనుసామ్రాజ్యము లోనికి తెచ్చి, జర్మనీ దేశమంతా ఒక్కటే దేశమనే ఊహను నెలకొల్పినాడు. కాని, యుద్ధము ముగియగానే

25

ఆ ఐక్యమంతా చెదిరిపోయి, ఎప్పటి వలె ఆయా రాష్ట్రములు ప్రత్యేకముగా వీడి పోతవనే భయము కలిగినది. అయినా, విద్యా సంబంధమైన ఐకమత్య మొకటి ఈ మధ్య తలచూపి, జర్మను భాష మాట్లాడే జనులందరున్ను ఒక దేశము వారె అనే భావము ప్రభలుతున్నది. ఈ ఐకమత్యము నిలకడ పొందవలెనంటే, సాంఘిక విభేదములను పాటింపని సాధారణ విద్యా విధానమున్ను, సాధారణ విద్యాలయములున్ను, కావలెను. 1920 సం. లో జర్మను సామ్రాజ్య విద్యాసభకూడ, ఈ భావమును బలపరచి, దేశమందంతటా సాధారణ విద్యాలయములు స్థాపితములు కావెలనని తీర్మానించినది. ఆ మరుసటి సంవత్సరము మూల ప్రభుత్వ శాసబసభలో (Reichstag) ఉన్నత విద్యాలయముల లోని క్రింది నాలుగు తరగతులను తీసి వేయవలసిన దనిన్ని, వాటిని వేరే ఏర్పాటు చేసి అందులో ధనికులు పేదవారు అనే భేదము గాని, వృత్తుల బేదముగాని పాటింపక, అందరు పిల్లలను చేర్చుకోవలసినదనిన్ని, ఒక శాసనము చేయబడ్డది.


26

జర్మనీ దేశములో విద్యా పరిపాలనము మూల ప్రబుత్వము వారిది కాదనన్నీ, అది రాష్ట్రీయ ప్రభుత్వముల వారిదనిన్ని, ఇంతకుముందు తెలుపబడినది. ప్రతి రాష్ట్రమున్ను తనబడుల పరిపాలనము నిమిత్తము కట్టుదిట్టమును చేసుకోవలెను. అందు చేత మూల ప్రభుత్వ శాసనసభ(Reichstig) నిర్వహించిన పద్ధతి ప్రకారము, ఆయా రాష్ట్రముల శాసబసభలవారు కూడా శాసనములులుచేసికొని ఇప్పుడు దేశమంతటా ఈసాధారణ విద్యాలయాలను స్థాపించినారు. ఇప్పుడీ ఉద్యమము ఒక్క జర్మినీ దేశములో మాత్రమమలులో ఉన్నది. స్విట్జరులాండు దేశము కూడా ఈ పద్ధతి నామోదించినది. యుద్ధానికి పూర్వము బాల బాలికలను ఉన్నత విద్యాలయాలలోనికి ప్రవేశ పెట్టడానికి ఏర్పడిన "ఫార్ షూలే" అనబడే ప్రారంభ విద్యలయాలు ఉన్నత విద్యాలయాలకు అనుబంధములుగానో, ప్రత్యేక విద్యాసంస్థ గానో ఉండేవి. ఇప్పుడవన్నీ అంతరించి పోయినవి. ధనవంతులు గానీ, పేదవారు గానీ,

27

వారుముందు ముందు అవలంబింపబోయే వృత్తులతో సంబంధములేకుండా నాలుగేళ్ళు ఒక్కటేబడిలో చదువుకొని ఒకటే రీతి విద్యను నేర్చుకొంటున్నారు. ఈ బడులకు "గ్రుంట్ షూలె" లేక పునాది బడులని కాని, "ఐన్ హేట్ షూలె" లేక ఏకత్వ విద్యాలయములని కాని ఫేళ్లు. వీటిని ప్రారంభవిద్యాలయాలతో కలిపి కాని, ప్రత్యేకముగా కాని, స్థాపించుతున్నారు. వీటిలో పిల్లలు జీతమివ్వనక్కరలేదు. వీటిలోని పేద పిల్లలకు పురపాలక సంభములవారు ఉచితముగా తిండి పెట్టి పుస్తాలిచ్చి, ఒకొక్కప్పుడు బట్టలు కూడ ఇస్తారు. పిల్లలందరున్ను ఒక్కటే మోస్తరు దుస్తులు ధరించ వలెననే నియమము లేదు. కాని, పిల్లల దుస్తులను బట్టి వీరు గొప్పవారు, వీరు పేదవారు అని తెలుసు కొనడము కష్టము. ఇప్పుడు ప్రపంచములో ప్రభలుతు ఉన్న సర్వసామాన్య స్వత్వమనే ఊహ ననుసరించే ఈ బడులు స్థాపితము లవు తున్నవి.

ఈ బడులను తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరున్ను మెచ్చుకొంటున్నారు.


28

ధనవంతుల పిల్లలు మిక్కిలి పేదవారి పిల్లలతో కలసి మెలసి, వారితో పాటే చదువుకొంటారు. గొప్ప వారి పిల్లలు తేమ పుట్టిన దినమ్లకు పేద పిల్లలను విందుకు పిలుస్తారు. మీదు మిక్కిలి గొప్ప వారి పిల్లలకు తమలో తమకు పడదట. వారు దెబ్బలాడుకోకుండా వారి మధ్యను పేద పిల్లలను కూర్చో పెట్టవలసి ఉంటుందట. కాని, ధనవంతుల పిల్లలు, కార్మిక కుటుంబముల వారికంటే ఎక్కువ తెలివి తేటలు గలవారుగా ఉంటారట.

పాఠక్రమములు, బోధన విషయములు, ఏవిషయము నెన్నెన్ని గంటలు బోధించడము, ఈ మొదలయిన వాటిని విద్యాంగ మంత్రి ఏర్పాటు చేస్తాడు. ఉన్నత విద్యాలయాల కనుగుణముగా ఈ విషయములు నిర్ణయింప బడుతవి. పిల్లలకు దినమునకు మూడు గంటలు మాత్రమే చదువు. వారమునకు మూడు సార్లు పిల్లలు ఉపాద్యాయులతో విహారాలకు పోతారు. బడి గదులలో కావలసిన


29

పటములున్ను, ఇతర విద్యాసాధనములున్నూ కావలసినన్ని వుంటవి. పిల్లల ఎత్తున గది గోడలకు నల్లని రంగు పూసి ఉంటారు. పిల్లలు వాటి మీద వ్రాసుకుంటారు. ఇందువల్ల ఒక తరగతి పిల్లలలో సగము మంది ఒక్కసారిగా వ్రాసుకొనడానికి వీలవుతుంది.

ఆధ్యాయము 6.

ప్రారంభ విద్యాలయములు. (ఫోక్ షూలె

}}


జర్మినీ దేశములో బాలబాలిక లందరు నిర్భందముగా ఆరేళ్ల వయస్సునుండి పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ విద్య నేర్చుకొనవలెనని శాసనమున్నది. ఈ ఎనిమిదేళ్ళలో మొదటి నాలుగేళ్ళున్నూ క్రిందటి అధ్యాయములో చెప్పబడిన సాధారణ పాఠశాలలో పదేళ్ల వయస్సు వరకూ అందురునూ చదువుకొనవలెను. ఆ తరువాత జీతము లిచ్చుకొని ఉన్నత విద్యాలయములలో చదువుకోలేని వాళ్లు సాధారణ పాఠశాలల

30