జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 4
గ్రామ బడులకున్ను, పట్టణపు బడులకున్ను చెప్పే విషయముల సంఖ్య ఒక్కటే గాని, బోధన చేసే తీరు మాత్రము వేరుగా ఉంతుంది. రెండువిధాల బడులలోను లెక్కలు చెప్పుతారు గాని, ఇచ్చే ప్రశ్నలు మాత్రము వేర్వేరుగా ఉంటవి. ఒకరీతి బడికి పనికి వచ్చే పుస్తకము, రెండో రీతిబడికి పనికి రాక పోవచ్చును.
ఆధ్యాయము 4.
"కింటర్ గార్టెన్ "బడులు
"కింటర్ గార్టెన్ "అంటే జర్మను భాషలో "పిల్లల తోట" అని ఆర్థము. ఫ్రోబెల్ అనే గొప్ప ఉపాద్యాయుడు పిల్లలకు పుస్తకాల ద్వార విద్య నేర్పకూడనిన్నీ, ఆటలు, సరదాలు మూలముగా నేర్ప వలసినదనిన్నీ, చెప్పి. ఇరవై ఆటలను కల్పించి నాడు. వీటికి "ప్రోబెల్ బహుమానములు" అని పేరు. పిల్లలు ఈ ఆటలలో ఉత్సాహము చూపేటట్లు అతడు చేసినాడు. వాటి మూలముగా
20
వారికి విద్ద్యాభివృద్ది చేసినాడు. ఫ్రోబెల్ అనంతరము అతనిని పద్దతి ననుసరించిన వారు, అతని అభి ప్రాయమును కనుక్కోలేక, అతడే బహుమానాలను ఏర్పరిచినాడో వాటినే గ్రుడ్డిగా అవలంబించినారు. అందు చేత పిల్లలకు వాటిలో ఉత్సాహము పుట్టక పోయినది. ఆటల మూలముగా విద్య నేర్పవలెనన్నీ, పై నిర్బంధమేమీ విద్యావిషయములో పిల్లలకుండ కూడదనిన్నీ, మాత్రమే ఫ్రోబెలు అభిప్రాయము. మొన్నటి యుద్ధమునకు పూర్వమే ఈ బహుమానము మీద పిల్లలకు ఆసక్తి పోయినది. అది చూచి, డాక్టరు మాంటిసారీ అనే ఆమె మరిఒక పద్ధతి మీద పిల్లలకు కొన్ని ఆటలను కల్పించినది. ఫ్రోబెలు పద్ధతి మంచిదా, మాటిసారీ పద్ధతి మంచిదా, అనే విషయములో ఇంకా వివాదము జరుగుతూనే ఉన్నది. పిల్లలకు అవకాశము (Space) ధ్వని, రంగులు, పొడవులు అనే విషయములను గూర్చిన గ్నానము నివ్వడానికి అనేకమైన పనిముట్లను కల్పించినది. ఆ తరువాత కొక్కెములు, గుండీలు మొదలయిన సాధారణ
21
జర్మినీలో నూటికి పది మంది పిల్లలు ఈ కింటర్ గారేన్ బడులకు పోతారు. తక్కిన తొంబైమందిన్ని తమ యిళ్ళలో చదువు కొంటారు.
22
ఇంటర్ గార్టెన్ బడులకున్ను ప్రథమిక విద్యాలయాలకున్ను ఎట్టి సంబంధమూ లేదు.రెండు బడులు మాత్రము అట్టివి విన్నవి. వాటిలో ఒకదానిలో విద్యావిషయమును బోధించే ఒక అద్యాపకుడు (professor) ప్రోబెలు, మాంటిసారి పద్దతులను ఎట్లు సమయ్వయము చేయడమని పరిశోదనలు చేస్తున్నాడు. ఇంగ్లాండులో వలె కాక, జర్మను విశ్వవిద్యాలయాలకున్ను బోధనాఅభ్యాసన కళాశాలకున్ను సంబంధము లేదు.
తల్లిదండ్రులు సరిగా చూడని పిల్లలకున్నూ, చెడు సహవాసము వల్ల గాని, తల్లి తండ్రుల ముద్దు
23
పిల్లల మొత్తము సంఖ్యలో నూటికి ఇరవై ఇద్దరు ఈ కింటర్ గార్టెన్ బడులలో చదువు కుంటారు. కాని, ఈ బడులలో చదువుకొనే పిల్లల కంటే, ఇంటివద్ద చదువుకొనే పిల్లలే ఎక్కువ తెలివి తేటలుగలవారని తెలియవస్తున్నది.