ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ప్రార్థనసమాజము

వికీసోర్స్ నుండి

ప్రముఖము లని నేను గనిపెట్టి, వీనిని సవరించి నా కాత్మవికాసము గలిగింపు మని పరాత్పరుని వేఁడుకొంటిని. లోకమందు భక్తులచిత్తములు నిరతము భగవదున్ముఖములగుచుండఁగా నాకుమాత్రము లోక విషయములె మఱింత హృదయరంజకము లగుచుండుటకు నే నెంతయు విషాదమందితిని !

2. ప్రార్థనసమాజము

రాజమంద్రి ప్రార్థనసమాజవార్షిక సభకు నా కిపుడు పిలుపు రాఁగా, ఆసందర్భమునఁ జదువుటకై "ఆస్తికమతాధిక్యము" అనునొక యాంగ్లోపన్యాసమును నేను సిద్ధపఱిచితిని. ఏప్రిలు 6 వ తేదీని నేను రాజమంద్రి వెళ్లితిని. మాయమ్మ యపు డారోగ్యవతిగ లేదు. మఱునాఁటిప్రొద్దున తమ్ముఁడు వెంకటరామయ్య యుపన్యాసము జరిగెను. ఆ సాయంత్రము నేను బ్రసంగించితిని. పలువురు సభికులు నా యుపన్యాసమును మెచ్చుకొనిరి. అందలి ముఖ్యవిషయము లిందుఁ బొందుపఱుచుచున్నాను : -

"ప్రార్థంసమాజమువారిమతము ఆస్తికమత మనియు, వారి యర్చనల కధిదేవత పరమాత్ముఁ డనియు నుడువనగును. ఇతరమతములకును దైవమే ముఖ్యమైనను, అవి యామహామహునికంటె నాతని యవతారములకును, ప్రవక్తలకును, ప్రతినిధులకును ప్రాధాన్య మొసంగుచున్నవి. పరిశుద్ధాస్తికమతమునకు మాత్రము దైవభక్తియె ప్రధానాంగము. దీనికి గొప్ప సిద్ధాంతగ్రంథములతోఁ బ్రసక్తి లేదు. మనష్యుని బాహ్యాంతరప్రకృతులే దేవదేవుని యునికికి సాక్షీభూతములు. జగత్తె యీశ్వరనిర్మితమగు దివ్యభవనము. మనస్సాక్షి మానవచారిత్రాదు లాస్తిక్యమునకు ముఖ్యనిదర్శనములు. పాప మనఁగ మానవశాసనోల్లంఘనముమాత్రమే గాక, పరమాత్ముని పవిత్రాజ్ఞా తిరస్కరణముకూడను. అఘోరవిపత్తునుండి మనుష్యుని రక్షించునదియే మతము. ఈశ్వరసాక్షాత్కారము వడయుటకు సాధనములు భక్తిధ్యానానుతాపములు, సత్కర్మవిచయమును. ఈ సాధనకలాపమున ప్రజ్ఞాశక్తులందు పెనుపొంది, జీవాత్మ పరమాత్మనుఁ జేరఁగలదు.

"తక్కిన మతములకు వలెనే ఆస్తికమతయాథార్థ్యమునకును సాక్ష్యము లేకపోలేదు. ఈ మతధర్మములచొప్పున జీవితయాత్ర జరుపుకొని ధన్యులైన యుత్తమజనులచరితములె దీనికి గొప్పసాక్షులు. రామమోహనరాయలు, దేవేంద్రనాథకేశవచంద్రులును, భరతఖండమున నిటీవల నీ మతప్రచారము సలిపి చరితార్థత నొందిన మహామహులు. ఈ సమాజసభ్యులగు మేము వారితో సరిపోల్పఁదగినవారము గాక, మా యాశయముల కుచితమగు నున్నతపదవినైన నందకున్న యల్పుల మైనను, స్వయంకృషిచే దినదినాభివృద్ధి నొందఁగోరుచున్న వారము. అజ్ఞానతిమిరమునుండియు, పాపకూపమునుండియు దైవానుగ్రహమున మే మొకింత తప్పించుకొని, సత్పథగాములమై సాగిపోవ నుద్యమించి యున్నారము."

ఆమఱునాఁడు ప్రార్థనసమాజమువారు బీదల కన్నదానముఁ జేసిరి. సాయంకాలము వీరేశలింగముపంతులుగారు "జీవితముయొక్క పరమార్థము, దానిని పొందు మార్గము" అను విషయమున నొక దీర్ఘోపన్యాసముఁ జేసిరి. మఱుసటిదినమున నేను బెజవాడ వెళ్లి, పాఠశాలలోని పనులు నెఱవేర్చుకొంటిని.

అప్పటికిఁ గొన్ని దినములకు వెనుకనే నాకు క్లార్కుదొరనుండి ప్రత్యుత్తరము వచ్చెను. యల్. టి. పరీక్షనిచ్చినపిమ్మట రెండు వత్సరము లీ పాఠశాలలో నుందునని వాగ్దానము చేసినఁగాని నా కిప్పటి జీత మీయఁజాల నని యాయన చెప్పివేసెను ! దీనికి నేను సమ్మతింపలేదు. నాతో క్లార్కుదొర జరిపెడిబేరములు విని మిత్రులు నవ్వసాగిరి. ఇతరోద్యోగ మేమియు సమకూర్చుకొనక, చేతనున్న పని వదలివేయఁగూడదు గదా. ఐనను, 10 వ ఏప్రిలు తేదీని నేను కోపమున క్లార్కుదొరకుఁ బంప నొకయుత్తరము లిఖించితిని. కాని, అనంతముగారి సదాలోచనము ననుసరించి, యది సవరించి, మఱి పంపితిని. ఇప్పటి జీత మీయనిచో నే నిచట నుండఁ జాల నని చెప్పివేసితిని.

అనంతముగా రొకనాఁడు నాతో మాటాడుచు, మావలెనే మా యాఁడువాండ్రును అపుడపుడు సమావేశమై సంభాషించుకొను చుండుట శ్రేయోదాయకమని సూచింపఁగా నే నందుల కంగీకరించితిని. 21 వ ఏప్రిలుతేదీని మే మిరువురమును అనంతముగారి గృహమును సందర్శించితిమి. ఆదంపతులు మాకు సుస్వాగత మొసంగి ఫలహారము లిడిరి. నే నొకింత భుజించినను, తన కుపాహారములు సరిపడవని నాభార్య చెప్పివేసి వానినిఁ గైకొనలేదు.

ఆదినములలో నొకప్రొద్దున దేవసహాయముగారు, యతిరాజులుపిళ్ళగారి తమ్ముఁడు, మఱి యిద్దఱు మువ్వురు స్నేహితులును వెంట రాఁగా, నేను కృష్ణదాటి, ఉండవల్లిపోయి, యచటఁ గల గుహలను వీక్షించితిని. మేడయంతస్తుల వలె కొండఁదొలిచి నిర్మాణముఁ జేసిన యాగుహలను జూచి మే మాశ్చర్య మందితిమి. అనంతశయనుఁడగు విష్ణుని విగ్రహము మా కచటఁ గానఁబడెను. పూర్వ మక్కడ ఋషి సత్తములు సమావేశమై, యీశ్వరధ్యాననిమగ్ను లగుచుండి రని మే మనుకొంటిమి. మిగుల దయతో మాకు పిళ్ల గారు కాఫీ, రొట్టె మున్నగు నుపాహారములు సిద్ధపఱిచిరి. మే మానాఁ డెంతో సంతోషమునఁ బ్రొద్దుపుచ్చితిమి.

రాజమంద్రికళాశాలావిద్యార్థులలో పట్టపరీక్షలో నాంగ్లమునఁ బ్రథమునిగ నుత్తీర్ణత నొందుటచే నాకు బహుమతి చేయఁబడిన స్కాటువిరచిత కథావళిని నే నీసమయమునఁ జదువుచువచ్చితిని. ఒక్కొక్కసారి యింగ్లీషు పుస్తకములలోని యంశములును, ఆంధ్రగ్రంథములును, పత్నికిఁ జదివి వినిపించుచుందును. ఏప్రిలు 27 వ తేదీని, స్కాటువ్రాసిన 'ఐవాన్‌హో'నవలను బూర్తిచేసితిని. కథా నాయికయగు 'రిబెక్కా'కాంతవిషయమై కృతికర్త పక్షపాతబుద్ధిఁ జూపె నని నే నసంతృప్తిఁ జెందితిని. ఆ యంగన యౌదార్యసచ్ఛీలతాసౌందర్యముల కనురూపమగు సౌభాగ్యగరిమ మామె కొసంగ లేదనియు, ఐవాన్‌హోను బరిణయమై రిబెక్కా సౌఖ్యాబ్ధి నోలలాడెనని కవి వర్ణింప లేదనియును, నేను విషాదమందితిని.

ఏప్రిలు 25 వ తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయునియొద్దనుండి నాకొక జాబు వచ్చెను. నా కాపాఠశాలలో ద్వితీయోపాధ్యాయునిపదవి నీయుఁ డని పాఠశాలలపరీక్షాధికారియగు నాగోజీరావుపంతులుగారు సిఫారసు చేసినట్లు వారు వ్రాసిరి. ఈ సంగతిని గుఱించి తలపోయుచు నామనస్సు మరల చంచలగతి నందెను !

నాలుగవ మేయితేదీని అనంతముగారు సతీసమేతముగ మమ్ము సందర్శింపవచ్చిరి. వారు మాయింటికి వచ్చినందుకు ఇంటి వారు తప్పు పట్టెదరేమో యని మేము భీతిల్లితిమిగాని, యట్లు జరుగ లేదు. సజ్జనులగు ననంతముగారి యెడ బెజవాడ వాస్తవ్యుల కమిత భక్త్యనురాగములు గలవు. "ఇస్లాము విశ్వాసము" అను నాంగ్లగ్రంథము నే నపుడు చదివి, మహమ్మదీయ మతసిద్ధాంతములను గ్రహించితిని. ఆపుస్తక మందలి ముఖ్యాంశములను నేను వ్రాసిపెట్టుకొంటిని. ఎంతో శ్రమకోర్చి నే నాకాలమునఁ జదివి యిట్లు సారము వ్రాసికొనినవ్రాఁత పుస్తకము లింకను నాయొద్ద నున్నవి.

6 వ మేయితేదీని స్నేహితులు గంగరాజు కనకరాజుగార్లు చెన్నపురినుండి వచ్చిరి. మేము మువ్వురమును గూడి యానాఁడు వీరేశలింగముగారి రాకకై బెజవాడరెయిలుస్టేషనునొద్దఁ గనిపెట్టుకొని యుంటిమి. పంతులుగారు భార్యాసహితముగా వచ్చి మాపొరుగున నుండు పాటిబండ వెంకటరమణయ్యగారి యింట విందారగించి, వెంటనే చెన్నపురి రెయిలెక్కిరి. మేము వారిని సాగనంపి వచ్చితిమి. మఱునాఁ డాస్నేహితులు రాజమంద్రి వెడలిపోయిరి. మాపాఠాశాలను వేసవికి మూయుటచేత, మేమును 8 వ తేదీని రాజమంద్రి బయలుదేఱితిమి.

3. వేసవిసెలవులు

9 వ మెయి తేదీని తమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి రాజమంద్రియందలి స్నేహితులను సందర్శింపఁ బోయితిని. 'సత్యసంవర్థనీ' సంచికను వేగమే ముద్రింపుఁ డని "వివేకవర్థనీ ముద్రాక్షరశాల"లోఁ జెప్పి, మిత్రులు పాపయ్య, రంగనాయకులు నాయుఁడు గార్లను వీక్షించితిని. మధ్యాహ్నము మృత్యుంజయరావు, నరసింహరాయుఁడుగార్లనుఁ జూచివచ్చితిని. మృత్యుంజయరా విపుడు నవీనముగ రాజమంద్రిలో స్థాపితమైన దొరతనమువారి బోధనాభ్యసన కళాశాలలో నుపన్యాసకుఁడు. నరసింహరాయుఁడుగా రేతత్కళా