ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/సత్యవోలు భగవత్కవి

వికీసోర్స్ నుండి


సత్యవోలు భగవత్కవి.


ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; జనార్ధనామాత్యపుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈతడు గోదావరీమండలములో నించుమించుగా నూటయేబది సంవత్సరములక్రిందట నుండినవాడు. ఇత డేనుగు లక్ష్మణకవి మొదలగువారితో సమకాలీను డని చెప్పుదురు. ఈకవి రచియించిన గ్రంథములలో రుక్మిణీపరిణయ మనెడు నాలుగాశ్వాసముల ప్రబంధము ప్రధాన మయినది. తాను నూఱుశతకములను జేసినట్టు కవియే తనగ్రంథమునం దిట్లు చెప్పుకొనియున్నాడు-


గురురాజకవి.


ఈకవి శేషధర్మములను తొమ్మిదాశ్వాసముల గ్రంథమును రచియించి బళ్ళారిమండలములోని జొహరాపురాధిపతి యైన సంజీవిరెడ్డిగారి కంకితము చేసెను. ఇత డిరువది ముప్పదిసంవత్సరములక్రిందట నుండినవాడు. కవిత్వము నిర్దుష్ట మని చెప్పుటకు వలదు పడకపోయినను మొత్తముమీద బుస్తకము రసవంతముగా నున్నదని చెప్పవచ్చును. కవికృతము లయినకావ్యాదులనుగూర్చి కృతిపది పలికినట్లుగా గ్రంథమునందీక్రిందిపద్యములు చెప్పబడినది.-