ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/మండపాక పార్వతీశ్వరకవి

వికీసోర్స్ నుండి

పెనుమచ్చ బుచ్చిరాజు.


ఈకవి పరతత్త్వప్రకాశిక యనెడి యెనిమిదాశ్వాసముల వేదాంతగ్రంథమును రచియించెను. ఇతడు క్షత్రియుడు; ధనంజయ గోత్రుడు; వేంకటపతిరాజకుమారుడు. ఈకవి తాను కర్లపాలెము గ్రామనివాసు డయినట్టును, సూర్యవంశపు రాజయినట్టును వ్రాసికొనియున్నాడు. భాగవతములోని కపిల దేవహూతి సంవాదమాధారముగా నీగ్రంథముపెంచి వ్రాయబడినది. ఇతడు తొంబదిసంవత్సరములు జీవించి కొన్నియేండ్లక్రిందటనే కాలధర్మమునొందినట్లు తెలియవచ్చు చున్నది.



మండపాక పార్వతీశ్వరకవి.


ఈవిద్వత్కవి శతకములు మొదలైనవి యెనుబదిగ్రంథములవఱకును రచియించినను ఈయనచే రచియింపబడి ముద్రింపబడియున్న గ్రంథములలో శ్రీరాధాకృష్ణ సంవాదమను నాలుగాశ్వాసముల ప్రబంధము ప్రధానమైనదిగానున్నది. ఈయన వైదికబ్రాహ్మణుడు; పారాశరగోత్రుడు; కామేశ్వరపండితపుత్రుడు. ఈకవియొక్క తండ్రితాతలుకూడ కవీశ్వరు లయినట్టు రాధాకృష్ణసంవాదమునందు కవి యీక్రిందిపద్యమున జెప్పియున్నాడు-శివమహత్వాద్య నేకవిధ ప్రబంధంబు లొనరించి సత్క వివినుతిఁ గనిస పారాశరసగోత్రపావనుం డగుమండపాక కామేశ్వర పండితునకు మహిత పుత్రత్వమును గాంచి బహుషిచిత్ర చిత్తశతిముఖ్య సత్కృతుల్ చెప్పి మెప్పు వడసితివి గద కులకీర్తి వచ్చి లంగ సరసగుణసాంద్ర పార్వతీశ్వరకవీంద్ర.

ఈకవి విళాఘపట్టణమండలములోని బొబ్బిలిసం స్థానమం దాసొనక వీశ్వరులలో నొకఁడుగా నుండిన వాడు. ఈ పార్వతీశ్వర శాస్త్రి గారు (గా 33వ సంవత్సరమునఁదు జనన మొంది 2వ సంవత్సర మధ్యమున పరమపదమునొందిరి. ఈకవి సంస్కృ తాంధ్రములయందు మంచి పాండిత్యము గలవాఁడయి మృదుమధుర నిరర్గళ ధారతో జతు క్విధక విత్వమును జెప్పుచు వచ్చుటయే కాక వినయ సౌశీల్యాది గుణసంపత్తి గల నాఁడయియుండెను. పూర్వోక మయిన రాధాకృష్ణ సంవాదము రావు వారను నామాం గరముగ ల వెలుగోటి వాగ నెజి గృహనామము చే వెలయు శ్రీ వేంక టగి రి సంస్థానాధిపతుల వంశానుక్రమమును వర్ణించెడు గ్రంథము. శతక ములును దండక ములును గాక యీకవి రచియించిన గ్రంథములలో 'కాంచీ పురమహత్త్వము, అమరుక కావ్యమ, ప్రబంధ సంబంధబంధనిబంధన గ్రంథము, శ్రీకృష్ణాభ్యుదయము', కొంత పెద్దవి. ఇప్పు డీయన గ్రంథ గులలో నొక్క రాధాకృష్ణ సంవాదమునుండి మాత్రము కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను—

శా. సాంగోపొంగముగా నితం డఖిలవిద్యల్ నేచ్చ నాఁ డోర్చినా డంగీకారము నింతపట్టు మృదుచర్యం బేర్చినాఁ డేర్చినాల రవి గారి ప్రతిమాస్త్ర పంక్తి నరి సైన్యారణ్య మి ఖయ్యు నే సొంగత్యంబుస సో వృథాక పటభాషందీచ్చనాఁ డిత్తజిక్ - ఆ. )

ఉ. పొయఁడు లెక్క లోక్కటిగ రంగడరcగ మెఱుంగుపూఁతలతో బూయఁడు భిత్తి భాగముల ముఖ్యపిధానము లందు మందతం బాయఁడు బాంధవాదులగు వారికిఁ జేయఁగలట్టి సత్కృతుల్ చేయఁడు వే ఓ నా కిపుడు చెప్పఁగ నేటికి మీ రెఱుంగ రే.

ఆ... దు. తనభూలోక ధురంధరత్వ మిపు డేత జగోపాలక షనరేంద్రుండు వహించె నాక భర మైనం బూమదుం గాక యం చు నృపాసుజ్ఞను గోరవచ్చిన ఫణీశుండో తదే కేచ్ఛ వ చ్చిన ప్రొక్కచ్ఛపమో యనం దన BC దచ్ఛ్వేతాత పత్రంబట -- ఆ. 3.


సత్యవోలు భగవత్కవి.


ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; జనార్ధనామాత్యపుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈతడు గోదావరీమండలములో నించుమించుగా నూటయేబది సంవత్సరములక్రిందట నుండినవాడు. ఇత డేనుగు లక్ష్మణకవి మొదలగువారితో సమకాలీను డని చెప్పుదురు. ఈకవి రచియించిన గ్రంథములలో రుక్మిణీపరిణయ మనెడు నాలుగాశ్వాసముల ప్రబంధము ప్రధాన మయినది. తాను నూఱుశతకములను జేసినట్టు కవియే తనగ్రంథమునం దిట్లు చెప్పుకొనియున్నాడు-