అమెరికా సంయుక్త రాష్ట్రములు/నాలుగవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

నాలుగవ అధ్యాయము

ఎర్ర యిండియనులు.


{ఎర్ర యిండియనుల స్థితి}


యూరపుజూతు లమెరికా సంయుక్త రాష్ట్ర మ లకు వచ్చు.సరికి అచట ఎర్ర ( తామ్రవర్లపు) ఇండి యనులు కాపురముండిరి. వీరుబొత్తుననాగరికులుగారు. వీరు పల్లెలను పట్టణములను స్థాపించుకొని స్థిరనివాసము గలిగి యుండిరి. ఇపుడిల్లినా యను రాష్ట్రమేర్పడిన ప్రదేశమున పూర్వమొక గ్రామమున నేడెనిది వేల మంది ఎర్రయిండియను. కాపురముండినని మంక పరామ మతబోధకును వ్రాసియున్నాడు. వీరు వేటాడి జీవించువారును స్థావరము లేక తిరుగుచునుండు వారును గాక భూములను. దున్నుకొని జీవించుచుండిరనియు బటాణీలు మొక్కజొన్న వీరి ముఖ్యమగు నాహారపదార్ధము లనియు బాంక్రాఫ్టు వ్రాసి యున్నాడు. వీరి ఇండ్లచుట్టును చిన్న చిన్న తోటలను వేసుకొనుచుండిరి. ఇపుడ మెరికా దేశమున ప్రధాన పంట

దినుసులుగనున్న మొక్కజొన్న, పొగాకు, ఈ రెండుసు ఇది వరకే ఎర్రయిండియనులు పండించుచున్నవే, లోహములు వాడుట తెలియక పోయినను వారు పడవలను గృహములను కట్టుకొనుచుండిరి. రాతిగొడ్డలులను కొడవళ్ళను ఉలులను ఉపయోగించిరి. చలికాలమునకై ఫలములను 'మొక్కజొన్నలను, ఎండ బెట్టిన దున్నపోతు మాంసమును పొగచూరబెట్టిన చేపలను కూడ కొట్టి చాచుకొనుచుండిరి. చాపలను, బుట్టలను, జాలరులను, చెప్పులను, జనుము నుండి దారమును, ఊనిన తోళ్ళము, మట్టితో పాత్రలను, తయారుచేయుచుండిరి. వారి భాషను , వాయనేర్చియుండిరి. దూరప్రయాణమునుచేయుచు ప్రయాణికుల కాతిథ్య మిచ్చుచుండి.. వీరనేకజాతులుగ విభ జించబడి 'పెద్ద పెద్ద రాజ్యముల నేర్పరచుకొని యుండిరి. కొన్ని జాతులవారు ప్రజాస్వామ్యములను మరికొన్ని జూతులవారు నిరంకుశ ప్రభుత్వములను కలిగియుండిరి. దాదాపుగ అమె రికాఖండమంతయు నీజాతుల వశమందుండెను. నాటుచేజు హ్యూరన్ పేర్లుగల జూతులవారు తమ ప్రభువులు సూర్యవంశీ సంభూతులని సమ్ముచుండిరి. ప్రభువులు అధికారమును సంకు చిత పరచుటకు ప్రజలసభ కూడ నుండెను. ఈ ప్రజల సభలో యుక్తవయస్సు వచ్చిన అందరు ప్రజలుసు మాటలాడ నర్హులు. స్త్రీలు గృహకృత్యములన: చేయుటయేగాక భూములను దున్నుట, పైర్లను ప్రోగుచేయుట మొదలగు వ్యవసాయపు పను లను గూడ చేయుచుండిరి. పురుషులు గృహములను, కోటను, పడవలను, యుద్దపరికరములను నిర్మించుచుండిరి. పతి జీవజంతువులోని ప్రాణమును శాశ్వతముగ నుండునని

వారినమ్మకము. కొందరు దున్నపోతు, ఎలుగుగొడ్డు మొదలగు జంతువులను పూజించుచుండిరి. కొందరు సృష్టిలోని శక్తుల నారాధించుచుండి , సృష్టినంతను చేసిన దొక్క యీశ్వరుడే యన నమ్మకము కూడ వారిలో చాల మందికుండెను. వారాధించు దేవతలకు మనుష్యులను బలియిచ్చుచుండి. ఒక మనుష్యుని నెపరైన హత్యకావించిన యెడల, హంతకుల చంపి పగసాధించు విధి యాతని వారసుల కుండెను. స్నేహము చేసిన యెడల మిక్కిలి విశ్వాసపాత్రులుగను, విరోధము సంభమిచినచో మిగుల క్రూరముగ పగతీర్చుకొనువారుగను నుండిరి. సాధ్యమగు సంతవరకు శతృవుతో నిలచి యుద్ధముచేయుటయు, తప్పించు గొని అకస్మాత్తుగ శతృ మాద పడి చంపి యూత: శిరస్సును ఖ-డించి తీసికొనిపోవుట యను, వారి యలవాటు. ఆ శ్తృవుల స్త్రీలను పిల్లలను పట్టుకొని బానిసలుగ చేయుటము అట్లు చేయుటకు వీలుగానిచో చంపివేయుటయు వారి యాచారము, మరణమునందు నిర్లక్ష్యమును ఆత్మ యొక్క శాశ్వత తత్వము నందు నిశ్చయమైన సమ్మక మును, మిత మైన జీవితమును విశ్వాస పొత్రమగు ప్రవర్తనయు వారి ల్క్షణములు. మరణించిన తరువాత వారు పొందెడు స్వర్గము లో అందమైన యడవులు ఫలవంతమగు వృక్షములు, మంచి 'వేటాడు స్తలములు, ఎల్ల ప్పుడును స్ఫటిక జలములలో ప్రవహించునదులు నుండుననియు అక్కడ తమ్ము నాశనము చేయుచున్న తెల్లజాతుల వారుండ రనియు వారి నమ్మకము " అని జోకినుమిల్లరను గ్రంధకర్త వ్రాసియున్నారు. చాలజూతులవారికి కుక్క తప్ప మరియేయితర

జంతువును మచ్చిక చేసి పెంచుట తెలియకుండెను. కాని యూరపుజాతులు అమెరికాలోనికి గుర్రములను తెచ్చిన తరువాత ఎర్రయిండియను జాతులం దరును గురములను పెంచుట కలవాటుపడి మంచి గుర్రపుసవారు లైరి. జార్జియా రాష్ట్రము నుండి తెల్లవారిచే తరిమివేయబడిన కీడలు, చెరొకీ• ను ఎర్రయిండియన జూతులు తక్కి నవారికంటె కూడ నాగరీకులుగా సుండిరి. వ్యవసాయము వర్తకము చేసికొనుచుండిరి. పశు వులను కలిగి యుండిరి.స్వభాషలో వ్రాసుకొనుచుండిరి. దీని వలన చాలమంది తెల్ల వారు చెప్పునట్లు నిజముగా ఎర్రయిండియనులు నాగరికతను నేర్పుటకుకూడ వీలేని 'మోటవారు కారని యూరపియములు వారనట్టి దుస్తితికి తెచ్చిరి నియు స్పష్టపడుచున్నది. ఎట్టి బాధలనైన సహించుటలో ఎర్రఇండి యనులు ఆ రితేరి.యుండిరి.. తెల్లజాతుల వారితో పోరాటములు : సలపవల సి వచ్చినప్పుడు ను నీసహన శక్తినే ప్రదర్శించిరి. జయము పొందుదుమను ఆశ నశించి, తనమీదికివచ్చు శత్రువుల సంఖ్యగా నునుగాని లక్ష్యముచేయక, ఎర్రయిండి యములు తాము నాశనమగువరకును అత్యంత పరాక్రమముతో నూరుమంది. శతృ వుల నొకడు చొప్పున వై సనుయుద్దము చేసి, తెల్లవారి చేతులలో మడ ముచుండిరి. హిప్పా నియోలా ప్రదేశములలో నివసించిన ఎర్రయిండియసులు మిగుల సాధువులు. వీరినందరిని నిర్దయతో ' వేరుపురుగైన లేకుండ స్పైన్ వారు నాశనము చేసి యున్నారు. మెక్సికో లోని ఎర్రయిండియనులు స్వల్పపోరాటమలతో స్పైన్ వారికి లోబడిరి. ఉత్తరము ననున్న ఎర్రయిండియను లింగ్లీషు వారిని ఒలాందావారికిని పరాసువారికిని "తేలికగ లోబడలేదు. తాము స్వతంత్రముగ నుండుటకు తుదివరకును ప్రయత్నించి జహు పట్టుదలతోడను పరాక్ర మముతోడను పోరాడిరి. తెల్లవారిలో సామాన్యపురుషులు వారి నెదిరించబాలకపోయిరి. యుద్ధభటులను వారి నోడించలేకపోయిరి. మంచియుద్దపు పేర్పాట్లను చేసి తుదకు ఎయిండియనుల నందరిని గుంపులు గుంపులుగను ఒకరొకరుగను నీ తెల్ల జాతులవారు నాశనము కేసిరి. (2)

{యూరోపియనులతో
సంబంధము}

ఎర్రయిండియనులకును తెల్ల వారికీని ఏర్పడిన సంబంధములను గూర్చి జె. యం. లడులో యను యూరపియనులలో ఆ గంధకర్త యిటులవ్రాసియున్నాడు. “ఎర్రఇండియనులకును తెల్లజాతులకును గల సం ఇంధములు సా ధారణముగ మొకేకనూదిరి నుండు చువచ్చెను. ముందు క్రొత్తగవచ్చిన తెల్లవారు ఎర్రయిండియనుల తో స్నేహము చేసిరి. ఇడియనులును తెల్ల వారి నాదరించి యాతి ద్య మిచ్చిరి . అదివరకే తెల్ల వారు వచ్చిన ఎర్ర యిడియలును బానిసత్యమునకై : యెత్తుకొనిపోయి యున్న ప్రదేశములలో మాత్రమెర్రయిండియనులు తెల్ల జారి కాతిథ్యమివ్వక మిగుల యనుమానముతో చూచిరి. స్నేహము కుదిరిన చోట తెల్లవారికిని యెర్రవారుజుబు యొడం బడికలు, షరతులు : జగి గెను. ఒకరి యర్దము రెండవ వాడికి సాధారణముగా తెలియదు. తెల్వారొక విధమునను ఎర్ర యిండియను లొకవిధమునను అర్దము చేసిరి. కొద్ది కాలము . లోనే ఒడంబడికలు, షరతులు, చెడిపోయి కలతలు ప్రారంభ మయ్యెను. దాదాపుగా యెల్లప్పుడును ముందు తెల్లవారే కయ్యమునకు కాలుత్రవ్విరి. ఉభయజాతులవారు నొకరి నొకరు నరకకొనిరి. ఉభయుల మధ్య యుద్ధము జరిగెను. త్వరితముగనే తెల్లవారికి బయము కలిగెను. చా వగమిగిలిన మెర్ర యిండియనులు కొత్త యెంబడికలు చేసికొనిరి. వీటి యందు యెయిండియనులకు సంపూర్ణమగు ద్వేషమేయండెను. వీటి యర్ధమును యెర్రయిండియనులకు కొంచము: గనే తెలిసెను. ఏర్రయిండియనుల దేశమునంతను తెల్లవా రాక్రమించి సముద్ర తీరము వరకును యచటనే వేసి కొద్ది ప్రదేశమును మాత్రమే ఎర్రయిండియనులు కాపురముండుటకు వదలిరి. ముందిక్కడ యెర్రయిండియనులు విధిలేక ప్రవేశించి కొద్దికాలములోనే తెల్లవారి పై తిరుగుబాటు చేసిరి'. ఈతిరుగుబాటులో తెల్లవారిచే యెర్రయిండియనులు చాల వరకు నశించుటయు చావగ మిగిలినవారు బానిసలగుటయు తటస్థించెను. కాని కొన్ని చోట్ల వివిధ జాతుల తెల్లవారు సమీపములో కాపురముండి ఒకరితోనొకరు కలహించుకొను చున్నపుడు మాత్రము తెల్లవారు ఎర్రయిండి యనుల గౌరవముగ చూచి వారి సహాయమునపేక్షించి ఉభయకక్షలవారును వారిసహాయము కోరగ కొందరొక పై పువను కొందరు మరియొక వైపునను చేరుటతటస్థించెను. తెల్లవారు తమ శత్రువులుగ తెల్లవారిమీదను వారితో చేరేడు యెర్రవారి మీదను తమతో చేరిన ఎర్రవారి సుపయోగించిరి. ఈయుద్ద ములలో నీయెర్రవారు చాల మంది మరణించి వీరిజూతులుబల హీనమయ్యెను. తుదకెవరో యొక తెల్లజాలివారికి జయము కలిగి యీజయము పొందిన తెల్లవారు తరువాత యధాప్రకార ము తమ చుట్టునున్న ఎర్రఇండియములను నాశనము చేసి వారి దేశము నాక్రమించిరి. "


కాని ఎర్రజాతుల విషయమున స్పైన్ నారు, ఫ్రెంచి వారు 'మొదలగు లాటిన్ తెల్లజాతులవారికిని ఇంగ్లాండు జర్మనీ మొదలగు ట్యూటానికు తెల్లజూతులవారికిని కొంత భేదము కలదు. స్పైన్ వారు మొదలగు లాటిన్ వారు సామాన్యముగ ఎర్రవారిని లోబర్చుకొని బానిసలుగ చేయుచువచ్చిరి. ఇంగ్లాండు, జర్మనీ మొదలగు ట్యూటానికు జాతుల వారు ఎర్ర యిండియనులను నాగరికతకు శత్రువులనియు నాగరికత నేర్పు టకువీలు లేని మోటవారసియు వీలయినంతతవరకు దొరకినవారి నెల్ల చంపుచు పచ్చిరి. మొదట స్పైన్ వారుకూడ పశ్చిమ యిండియా లంకలలోని కాపురస్తులనునరకి వేసి నాశము చేసి యున్న స్పటికినీ తువాత నాపద్దతిని మానివేసి వారిని బానిసలుగా చేయుచు పచ్చిరి. కావున యిప్పటికిని మధ్య దక్షిణ అమెరికాలలోని స్పెన్ వారి ఆధీసముసున్న దేశము లన్ని టీలోను చాలమంది ఎర్రయిండియను లున్నారని పందొమ్మిదవ శతాబ్దమున బానిసత్వపు శృంఖములు తెగిపోయి వీర లెల్ల వారితో కలసి పోవుచున్నారు. ఇట్లు కలవనిచోట్ల కూడ అమెరికాలోను మెక్సికోలోను నీయెర్ర జాతులు నవనాగరి కత నవలంబించి స్వతంత్రులగు పౌరులుగనున్నా రు. ఉత్తర అమెకాలోని కెనడా దేశపు కొన్ని ప్రాంతములలో వరాసులు మెర్రయిండియనులతో కలిసిపోవుటవలన మిశ్రమ బాతు లేర్పడి యున్నారు. ఇట్లు స్పైపోరును పరాసు వారును సాధ్యమయినంత వరకు ఎర జాతులను చంక బాని పలుగ చేసి విడిచిన కారణము వారవలంబించిన రోమను కాథ లికుముత మే ఎక్కుడనైనపు పొట సైంటు మతగురువులు ఎర ఇంటయసు ను, బాగు చేయ ప్రయత్నించినను అక్కడి తెల్ల ప్రభుత్వములవారు ఇండియనులపై యుద్దము ప్రకటించుటయు వెంటనే ప్రభుత్వమువారి కోరిక పై నీమతగురువులు ఎర్రయిండి యనులతో జోక్యము వదలుకొనుటయు తటస్థించారు. రోమను కాథలిక్కు ను గురువులట్లుగాళ ఎ.ఇడియనుల నందరిని కై స్తనలుగ చేయుచి వచ్చిరి. స్పైక్ వలసరాజ్యముల లోను ఏరాసుల వలన రాజ్యములలోను ఎరయిండియసుల నందరను ఏదోవిధముగ క్రైస్తవులుగచేసిరి. వీరిని క్రైస్త వులుగ చేయుటకు తెల్ల మతగురువులచే యవలంబింపబడిన పద్ద తులు యోగ్యమయినవి గాకపోవచ్చును. రైస్తవులయిన ఎర్ర యిండియనుల పవర్తన క్రైస్తవధర్మము లకు తగినటుల లేక పోయి యుండవచ్చును. కాని వారందరుసు క్రైస్తవ మతమును స్వీకరించి యభివృద్ధి గాంచిరి. ఆంగ్లేయ వలన రాష్ట్రమగు న్యూ Wంగ్లాండులో సెబాస్టియను రాఫిలను అను పరాసు రోమసుళాథలిక్కు మతగురువు అబినాకిను అను నాగ ఎయిండియసుల గ్రామమున నివాస మేర్పరచుకొని అచటి ఎర్రయిండియనులను క్రైస్తవులుగ జేసి వారిగాక ప్రార్థనాలయమును స్థాపించి ప్రజానురంజకు డ్రా చుట్టుపట్టుల నున్న ఎరయిండియనులలో క్రైస్తవమతమును వ్యాపింప చేయుచుండెను. 1725 ఏ సంవత్సరమున న్యూ యింగ్లాండు రాష్ట్రపు ఆంగ్లేయ ప్రభుత్వ మువారు ప్రతి యెర్రయిండియనును వుర్రెకును నూరు షిల్లింగులు చొప్పున బహుమాన మిచ్చెద మని ప్రకటింపగ నారాష్ట్రములోని ఆంగ్లేయుల జట్టొకటి బయలు దేరివచ్చి యూగ్రామముమీద పడి దోచుకొని తగుల బెట్టి క్రైస్తవ దేవాలయమును మంటల కాహుతిచేసి ఎర్ర యిండియములను చంపి పుర్రెలు తీసుకొని పోవుటయే గాక యామతగురువుకు శరీరములో ననేక పోటులు పొడిచియు తల పగులగొట్టియు క్రూరముగ హత్య గావించి నోటిలోను కండ్లలోను మట్టిగొట్టి పోయిరి.


సంయుక్త రాష్ట్రములలో 1768 వ సంవత్సరమువరకు ఎర్రయిండియసులు మిస్సిసిపీనదీ ముఖ ప్రాంతమునను 'సెంటు లారెన్సుల కిరు ప్రక్కలను టెనెస్సీలోయలోను, ఎరీ, హ్యూరన్, సరస్సుల పక్కలను ఇకను మిగిలియున్నారు. తక్కినవారు నాశనమయి నారు. 1768 కు తరువాత నీ ప్రాంతములన్నియు తెల్ల జాతులచే నాక్రమింపబడి ఎర్రయిండియనుల దృశ్యులై పోయిరి.