శ కున శాస్త్రము
15
తా. ఓ లక్ష్మీశా ! నరసింహస్వామి! పురమును ప్రవేశించి
వచ్చునపుడు యెడమవైవున బల్లి పలికినచో శుభము లధికముగా
గల్గును శుభకార్యములు వెంటనే సిద్దించును.
క. కుడి దిక్కుఁ బలుక , కార్యం
బెడనెడ నాలస్యమగును, | నెదురుగ బలుకన్
పడగొట్టి నటులఁ గార్యము
చెడు, వెనుకను బల్క శుభము | శిఖినరసింహా.42
తా. ఓ నరసింహస్వామి! పురి ప్రవేశించునపుడు బల్లి కుడి
వైవునుండి పలికిన కార్య మాలస్యముగా నగును. ఎదురుగ బల్కి
నచో కార్యము చెడిపోవును. వెనుకనుండి పలికిన చో శుభముకలుగును,
క. తోరణ గౌళియుఁ బలికిన
నారూఢిగ బంధుహిత ప్రి |యాంగన రాకల్
కోరిన కోరిక లబ్బును,
శ్రీరమణా నిశ్చయంబు | శిఖి నరసింహా.43
తా. ఓ నరసింహా! బలుల సమూహము పలికినచో బంధువులు,
స్నేహితులు,ప్రియురాండ్రు వచ్చెదరు. కోరిన కోరికలు నెఱవేరును.
క. ధర పయనము నడువంగా,
వర దక్షిణగౌళి పలుక | వరలును శుభముల్
నెరయోధుల పెండ్లిండ్లకు ,
సిరు లలరఁగ బసిఁడివంట | శిఖినరసింహా.44
తా. ఓ నరసింహస్వామీ! ప్రయాణమై పోవునపుడు దక్షిణ
ముగా బల్లి పలికిన శుభములు గల్గును. పెండ్లిండ్లప్పుడు పలికిన
ధనలాభము గల్గును.