వెలుగోటివారి వంశావళి
రణవీథిఁ గొండమల్రాజుఁ గొమ్మలదేవు పిన్నని జయరుద్రుఁ బెనఁచి తఱిగి తలలు పొక్కండ్లుగా నిలిపి తద్రక్తమె యెసరుగా బలివండి యెసకమెసఁగి[1] హెమ్మాడియును గూడి యెలమి నూటొక్కండ్ర రాజులఁ బగఁబట్టి రమణఁ జంపి కలుగాన్గ లాడించి కలరక్త మెల్లను భూతసమితి తృప్తి పొందుపఱచి జల్లిప ల్లొద్ద రాజుల త్రుళ్లణంచి యహహబిరుదులు[2] పచరించి రపుడు వేడ్క ననుమగ ల్చొచ్చి రల భట్టు లౌననంగ[3] మహిని సింగయయనపోతమాద విభులు.
ధర శకాబ్దము శిఖికరిభాను[4]శార్వరి కార్తికశుద్ధపక్షంబు నందు హరిహరబ్రహ్మలు నలయరుంధతియును[5] శశిరవిగ్రహములు సాక్షి గాఁగఁ బితృపితామహులకుఁ బ్రీతిగా రేచర్ల[6] గోత్రమహత్త్వంబు కొమరు మిగుల బలసముద్ధతి సోమకులరాజరాజుల బలభేది గదియఁ గొలువఁ బనిచి భూమి[7] సోమకుల పరశురామ బిరుదు శాసనస్తంభమున వేసి జల్లిపలి కడను భట్రాజతతి[8] నన్మగంట నిలిపి పరఁగి రనపోత మాదభూపాలవరులు.