వెలుగోటివారి వంశావళి
క్షత్రియకులము నిఃక్షత్రంబుగాఁ జేయు పరశురాముని రీతిఁ బగ యణంచి[1] కీచకవీరుల గీటణఁగించిన పవనతనయు రీతిఁ బగ యణంచి గాంధారి సూనులఁ గణఁగి యుక్కణగించు[2] ఫల్గును కైవడిఁ బగ యణంచి పన్నగ నికరంబు పరఁగంగఁ ద్రుంచిన పక్షినాథునిరీతిఁ బగ యణంచి యిట్లు జల్లిపల్లి నెనసిన[3] చాళిక్య వంశకరులనెల్ల వరుసఁ ద్రుంచి పరఁగె నన్నవోతు[4] ప్రతిగండ భైరవ బిరుదరాజగండ[5] భీకరుండు.
రాజుల నూట యొక్కరి శిరంబులఁ ద్రుంచి రణంబులోపలన్ రాజకుమారు లెమ్ము రుధిరంబుల వండిన భుక్తిఁ దృప్తులై రాజకపాలపాత్రమున రక్తముఁ గ్రోలుచు భూతకోటు ల[6] ట్లాజిజయుండు సింగవిభు నగ్రసుతుం డనవోతుఁ బాడెడున్[7].
కొమ్మని మచ్చయౌబళుని[8] గూల్చి శిరంబులు ద్రుంచి గన్నయన్ బిమ్మటఁ ద్రుంచి తత్సుతులఁ బేర్చిన బొమ్మలు వెట్టి[9] దారులం దమ్మటము ల్వెసం గొనియె దాచయసింగనిపట్టి యెట్టిడో[10] బొమ్మలు బెట్టు నిట్టు[11] లనపోతఁడు[12] వైరముఁ బూను వారికిన్.