పరశురాముఁడు రాజపటలంబు ననిలోనఁ
జదిపిన[4]నాఁటి మాంసంబురుచులు
కినిసి రాముఁడు దశగ్రీవాదిదైత్యులఁ
దనియించు[5]నాఁటి నెత్తురులరుచులు
కవ్వడి గాంగేయఘనయోధముఖ్యుల
జంపిననాఁటి మజ్జం[6]పురుచులు
వాసవుఁ డుగ్రజంభాసుర[7]ప్రముఖులఁ
దునిమిననాఁటి మేదోరసంబు[8]
..............................................[9]
నాయకాధీశు వెలుగోటి నాయనేంద్రుఁ
జేరి యనిలోనఁ జిరకాల[10]జీవులైన
భూతములు సొక్కు దశదిశాభూములందు.