72
వెలుగోటివారి వంశావళి
నారదుం డాహరినామకీర్తన సేయ వ్యాసప్రహ్లాదులు[1] డాసి రాఁగ వరుస విష్వక్సేన వాసుకుల్ పొగడంగ[2] జయవిజయాదులు సాగి[3] కొలువ బన్నగాశనుఁడు వెంపార[4] ముందఱఁ జన నంజనాసూనుఁ డంతంత నడవ[5] నింద్రాదిదేవత లెల్ల నుతింపంగ గంధర్వకిన్నరగాన మెసఁగ సకలవైష్ణవసన్నాహసమితి చేరి పరిణమింపంగ వైకుంఠపదముఁ గాంచెఁ ద్రిజగముల వెల్గు[6] సంగ్రామదీక్షగురుఁడు రాయభూపుఁడు[7] రెండవరాఘవుండు.
తదనంతరంబున.
ఘనతరమందారకల్పకంబులనీడ గడువేడ్క విశ్రాంతి నడచి నడచి ప్రాకారవిలసితప్రౌఢరత్నద్వార ములు సొచ్చి మదిలోనఁ జెలఁగి చెలగి సురుచిర[8]మణిమయసోపానములకాంతి తఱచైన వీథుల మెఱసి మెఱసి వైకుంఠసౌభాగ్యవైభవస్ఫురణలఁ జూచుచుఁ బలుమాఱు సొక్కి సొక్కి వచ్చి వైకుంఠనగరంబుఁ జొచ్చి రాఁగ దేవభామలు[9] స్వర్గము త్రోవ నిల్చి