పుట:మత్స్యపురాణము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ప్రథమాశ్వాసము


వ.

ఇవ్విధంబున స్తుతిపూర్వకంబుగా నే నిన్నవించిన వచనంబు లాకర్ణించి
మందస్మితవదనుం డై దశనద్వుతు లధరంబుపై దళుకొత్తఁ గూర్మిసలు
పుచు నట్టి పరమతేజోమయమూర్తి న న్నవలోకించి యిట్లనియె.

112


సీ.

కమలజ విలసిల్లు గాఢాంధకారసా
        గరమునఁ దిరుగ నొక్కటి క్షణంబు
కాలంబు చనియెఁ దత్కాలంబు నీకును
        వేయేండ్లు నై తోఁచె విస్మయముగ
నాతమోరూపమై నదియె మన్మాయాప్ర
        భావంబు దాసనే ప్రబలె జగము
మోహాంధ మై నాశమును నుద్భవంబును
        నొందు నకుంఠితోద్యోగసరణి


గీ.

నచట నీ చేత దృష్ట మై నట్టి పురము
మన్నివాసంబు వైకుంఠమందిరంబు
చతురతత్పురమధ్యమాంచితము లైన
ధరణిధరములు నాల్గు వేదంబు లనఘ!

113


శా.

నీ వీ తత్వ మెఱుంగు మబ్జభవ యే నీకుం బ్రవచించెదన్
భావంబందు మదీయపాదయుగళీభక్తిప్రసన్నాత్ములై
ధీవర్యుల్ గతపాపు లై యమరు లై దివ్యాకృతిప్రఖ్యులై
యా వైకుంఠపురంబు నొందుదురు నిత్యానందసంపన్నులై.

114


క.

ఆ దివ్యనగరినడుమను
బాదుగ విలసిల్లు రత్నపర్వతములు
వేదంబులు నీ విఁక విను
ప్రాదుర్భూతంబు లందుఁ బద్మజ జగముల్.

115


గీ.

అట్టి వేదరాసు లగు సత్స్వరూపంబు
లందు నిశ్చితార్థ మాచరించి
చనఁగ నేర్చు మనుజు లనిమిషాధిపవంద్యు
లగుచు ముక్తిఁ బొంద నరుగువారు.

116