పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యరంగం

డా॥ మధురాంతకం నరేంద్ర 98662 43659

రవీంద్రనాధ టాగూరు 'ముక్తధార '

సమకాలీన సాంఘిక రాజకీయ సాంస్కృతిక కల్లోలాల్ని గమనించినప్పుడల్లా వెంటనే గుర్తుకువచ్చే రచన రవీంద్రనాథ్‌ టాగూర్‌ నాటకం ముక్తధార. ఇటీవలి కోవిడ్‌ విపత్మర పరిస్థితి మళ్ళీ మళ్ళీ'ముక్తధార 'ను జ్ఞాపకం చేస్తోది.

1922 రవీంద్రుడు రాసిన నాటకం ముక్తధార. అప్పటికి భారతదేశ స్వాతంత్రోద్యమం పుంజుకోలేదు. అప్పటి విదేశీయ పాలన నేపథ్యంలో వుత్తరకోట, శివతరాయి అనే రెండు రాజ్యాల మధ్య రగిలిన సంఘర్షణను రవీంద్రుడు గొప్ప అన్యార్థ రచన (Allegory)గా తీర్చిదిద్దాడు.

వుత్తరకోట పర్వతాల్లోంచి పుట్టిన ముక్తధార నది శివతరాయి పంటలకు జీవదాయినిగా వుంటోంది. అయితే వుత్తరకోట రాజు రంజిత్‌ శివతరాయినెప్పుడో తన పాలనలోకి తెచ్చేశాడు. శివతరాయినుంచీ విదేశాలకు వ్యాపారం చేయడానికి వెళ్ళే నందికొండ మార్గాన్ని మూసేసి, శివతరాయి ప్రజలు తాము పండించిన పంటల్ని ముడి పదార్ధాల్ని కేవలం వుత్తరకోటకు అమ్ముకునే పరిస్థితి తెచ్చాడు. తక్కువ ధరలకవి కొనుక్కొని, వాటినుంచీ తయారు చేసిన వస్తువులను వాళ్ళకే అధిక ధరలకు అమ్మి, వాళ్ళను తన చెప్పుచేతల్లో వుంచుకున్నాడు. అంతటితో సంతృప్తిపడక ముక్తధార నదికి ఆనకట్ట కట్టి నదినీళ్ళను తన అదుపులో వుంచుకోవడం ద్వారా శివతరాయిని మరింతగా అణగతొక్కాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ముక్తధారకు ఆనకట్ట కట్టడం అంత సులభమైన పనేమిగాదు. యెందరో ప్రయత్నించారు. ఆనకట్ట సగంలోనే విరిగి నదివేగానికి తట్టుకోలేక, కొట్టుకుపోయింది. చివరకు విబూతి అనే రాజయంత్ర నిపుణుడు ముక్తధారకు ఆనకట్ట కట్టేశాడు. మొత్తం వుత్తరకోట రాజ్యమంతా, రాజుతో సహా విబూతిని భైరవస్వామి ఆలయంలో సన్మానం చేయడానికి పూనుకుంది. మొత్తం 'ముక్ష్తధార" అనే నాటకం విబూతికి సన్మానం జరుగుతున్న రోజులో జరుగుతుంది.

రవీంద్రుడి నాటకాల్లో రాజులు, నాయకులవంటి ముఖ్య పాత్రలకంటే బిచ్చగాళ్ళూ, యాత్రికులూ, పాటలు పాడేవాళ్లు, దీపాలు అమ్మేవాళ్ళు, 'పెరుగమ్మే పడతులు మొదలైన సామాన్యులే యెక్కువ సేపు కనబడతారు. వాళ్ళు వాళ్ళ నాయకులకంటే యెక్కవగా వుద్రేక పడుతూవుంటారు. శివతరాయి ప్రజలను చూస్తే వుత్తరకోట ప్రజలకు చులకన కంటగింపూ.

రంజిత్‌కు అభిజిత్‌ అనే పెంపుడు కొడుకున్నాడు. శివతరాయి ప్రజలంతా థనుంజయుడనే బైరాగిని నాయకుడుగా గౌరవిస్తూ, వుత్తరకోటపైన తిరిగబడ్డానికి ఆయన అనుమతి కోనం వేచి చూస్తున్నారు. ముక్తధార నదిలో ఆగకుండా పడిలేచే తరంగాల్లా ఆ రెండు దేశాల్లోని ప్రసిద్దులూ, అప్రసిద్దులూ, వరసగా యెదురై భేటీ పడతారు. యొప్పుడో అనాదిలో మొదలై నిరంతరంగా సాగుతూ, భవిష్యత్తులోనూ ఆగకుండా సాగే యీ మానవతరంగాల సమూహాలు వొకదినంలో చేసిన భేటీలతో రవీంద్రుడు మొత్తం సమకాలీన ప్రపంచానికంతా నిలువెత్తు ప్రతిబింబాన్ని నాటకంలో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. చాలా ముక్తసరిగా చెప్పిన యీ కథనింతవరకూ చదివిన వాళ్లకు శివతరాయి నాటి భారతదేశానికీ, వుత్తరకోట నాటి యింగ్లీషు ప్రభుత్వానికీ ప్రతీకలని స్పష్టంగానే అర్ధమయిపోతుంది. అయితే దాన్ని రెండు సంస్కృతులకు జరిగిన సంఘర్షణగా మాత్రమే గాకుండా సార్వకాలికమైన మానవ జీవన గమనంగా రూపొందించడంలోని రవీం[ద్రుడి ప్రతిభ విస్మయుల్ని చేస్తుంది.

“ముక్తధార” నాటకం అఖిజిత్‌, ధనంజయుడు అనే రెండు యిరసుల పైన సాగే రథం. అఖిజిత్‌ రంజిత్‌ కన్నకొడుకు కాదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం రంజిత్‌ వొకనాడు వాహాళికోసం ముక్తధార నదీ తీరానికెళ్ళాడు. అప్పుడక్క్మడ నతీ తసిగాల డొలల్లో వూగుతున్నాడేమో కనిపించేలా తీరంలో వో పని బాలుడు కనిపించాడు. ఆ బాలుడు భవిష్యత్తులో రాజాధిరాజు అవుతాడనీ ఆస్థాన జ్యోతిష్యుడు చెప్తాడు. రాజు ఆ బాలుడ్ని అఖిజిత్‌ అని పేరు పెట్టి పెంచుకుంటాడు. యువకుడయ్యాక అతడ్ని శివతరాయి రాజ్యానికి పంపి తన ప్రతినిధిగా పాలించమంటాడు.

అయితే శివతరాయికి వెల్లిన అభిజిత్‌ ఆ దేశప్రజలను పీడించడానికి బదులుగా ప్రేమించడం మొదలు పెడతాడు. కరువు వచ్చిందని పన్నుల్ని వసూలు చేయడు. పైగా ముక్తధార నదిపైన ఆనకట్ట పూర్తవగానే తానో చెరసాలలో పడ్డట్టుగా విలవిల్లాడిపోతాడు. అతనిలోని యీ ఆందోళనను గమనించిన అతని ఆత్మీయ స్నేహితుడు, సంజయుడనే మరో యువరాజు, అతడ్ని వీలయినంతగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన జీవితపు ఆలంబన యేమిటో క్రమంగా యిప్పుడే తెలిసివచ్చిందని - అభిజిత్‌ మిత్రుడికి చెప్తాడు. అతడికి పుట్టుకతోనే ముక్తధార నదితో మానసిక బంధం పడిపోయివుంది. ఆ నదిని బంధించినప్పుడు అతడి మనస్సూ పంజరంలో కట్టుబడిపోయినట్టయి పోయింది. అతనికి మళ్ళీ స్వేచ్చకావాలంటే ఆ పంజరాన్ని పగలగొట్టక తప్పుదు. అది అతడి మానసిక అవసరం. తప్పదు.

మనిషి ప్రకృతిలో వేరుగా వుండడానికి వీల్లేని భాగం. ప్రకృతిలోని వాటిని వాడుకుని మాత్రమే మనిషి జీవిస్తున్నాడన్నదే అందుకు నిదర్శనం. మనిషి మనస్సుకూ, ప్రకృతికీ అవినాభావమైన సంబంధముంది. మనిషీ, ప్రకృతీ సుఖదు:ఖాల్ని పరస్పరం పంచుకోక తప్పదు. ప్రతి మనిషి మనసూ ప్రకృతిలో యేదోవొక దానితో విడదీయరానంతగా ముడిపడి వుంటుంది. అది గుర్తించగలిగిన వాళ్లకు స్వాంతనముంటుంది. ఆయా ప్రాకృతిక భాగానికి దెబ్బతగలడం వల్లనే తమలో అశాంతి పెరుగుతుందని గుర్తించిన వాళ్ళు ప్రకృతిలో సమన్వయంకోసం తమ వంతుపని తాము చేస్తారు. అలా గుర్తించుకున్నవాళ్ళ శాతం బాగా తగ్గిపోయినప్పుడు విపత్తులు తప్పవు.

తన జీవనానందం ముక్తథార నదితో ముడిబడివుందని గుర్తించిన అపురూపమైన మానవుడు అఖిజిత్‌. ఆ నది పాదాల్ని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

48