భాషాసాధికారత
ఆచార్య గారపాటి ఉమామహేశ్శరరావు 98661 28846
22 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలి
భారతీయభాషల సాధికారతకై “బెంగళూరు తీర్మానం” పిలుపు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డివ) యొక్క ఎజెండా అనే పేరుతో గతంలో, లోకసభ ఎన్నికలు జరిగేముందు (1999) జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన ఎన్సికల కార్యాచరణ పత్రాన్ని(మ్యాని ఫెస్టో) తయారు చేసింది. ఈ కార్యాచరణ పత్రంలో, తాము గెలిచినప్పుడు తీసుకొనిరాబోయే కొన్ని రాజ్యాంగ మరియు చట్టపరమైన సంస్కరణలను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, నం. 25వ అంశం, పేజి 131లో పేర్కొన్న విషయం ఇట్లా ఉంది: “రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో చేర్చబడిన మొత్తం 19 భాషలను అధికారిక భాషలుగా పరిగణించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని పేర్కొంది. 2003లో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణద్వారా ఎనిమిదవ షెడ్యూలులో ఉన్నవాటికి మరో మూడు భాషలను చేర్చగా- మొత్తం 22 భాషలు అయినై. పైన ఉటంకించినదానికి అనుగుణంగా మొత్తం 22 భాషలనూ భారత సమాఖ్య అధికార భాషలుగా చట్టబద్ధతను కల్ఫించేందుకు అనువుగానూ వివిధ భారతీయభాషల మధ్య ఉన్న అసమానత్వాన్ని తొలగిస్తూ భారత పార్లమెంటు కార్యాచరణను మొదలుపెట్టేందుకు వీలుగా, ఈ యేడాది, ఫిబ్రవరి 8-9వ తేదీలలో కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షులు శ్రీ టి. ఎస్. నాగాభరణగారి ఆధ్వర్యంలో, డాక్టర్ వి.పి. నిరంజనారాధ్య కార్యనిర్వహణలో, డాక్టర్ కె. మురలీధర్ కార్యదర్శకత్వంలో బెంగుళూరులో రెండురోజుల చర్చా సమావేశం జరిగింది. ఆ సమావేశానంతరం, భారతీయ భాషల సాథికారితను సాధించేందుకు వీలుగా ఎనిమిదవ షెడ్యూలులో పేర్కొన్న 22 భాషల ఔత్సాహిక ప్రతినిధులకు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్మానం ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ తీర్మానం అనువాదాలను 22 భాషలలోనూ ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించబోయే మాతృభాషా దినోత్సవ సందర్భంగా దేశమంతటా విడుదల చేసేందుకు వీలుగా కన్నడ ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఈ తీర్మానానికి తెలుగు అనువాదం ఈ కింద ఇస్తున్నాం.
భారతీయ భాషల సాధికారతకు బెంగళూరు తీర్మానం
భాషా హక్కుల కోసం మేము, అన్ని రాష్ట్రాలూ మరియు కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులమూ కలిసి మన రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లోని జాబితాలో పేర్కొన్న భాషాహక్కుల సమానత్వాన్ని సాధించే అంశంపై చర్చించాము. రెండు రోజుల చర్చల తరువాత, భారత రాజ్యాంగానికి తప్పనిసరిగా ఇందుకు అవసరమైన సవరణను తీసుకురావాలని భారత ప్రభుత్వానికి గట్టిగా పిలుపునిస్తూ ఈ బృందం ఏకగ్రీవంగా “బెంగళూరు తీర్మానాన్ని” ఆమోదించింది.
అయితే, భారత సమాఖ్య అనేక భాషలను మాట్లాడే వ్యక్తులతో కూడి, ప్రతి భాషకూ దానికే స్వంతమైన గొప్ప చరిత్రతోనూ ఆయా భాషలను మాట్లాడే ప్రజల సంస్కృతితోనూ విడదీయరాని అనుబంధం కలిగి ఉంది.
కాగా, భారత రాజ్యాంగం, ఎనిమిదవ షెడ్యూల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మాట్లాడే ఇరవై రెండు భాషలను సమాఖ్య యొక్క భాషా వైవిధ్యానికి ఆనవాలుగా గుర్తించింది.
కాగా, భారత సమాఖ్య, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడింది, ఈ సమాఖ్య లక్షణమే భారత రాజ్యాంగంలోని మౌలిక వైఖరి.
కాగా, భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ విద్య మరియు ఉపాధికి సమాన అవకాశాలకు హామీ ఇస్తుంది.
అయితే, భారత సమాఖ్య పరిధిలోని విద్యాసంస్థలలో ప్రవేశ పరీక్షలనూ, ఉపాధి అవసరాల కోసం అర్హత పరీక్షలనూ నిర్వహిస్తున్న
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021
10