పుట:Neti-Kalapu-Kavitvam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిదర్శనాధికరణం

57


అవుతున్నవి గాని కావ్యంగాదు. ఇందుకే "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న సాహిత్యదర్పణకారుడు,

"తత్ర వాక్యం యథా శూన్యం వాసగృహం" ఇత్యాది "మహావాక్యం యథా రామాయణ మహాభారత రఘువంశాది" (సాహి)

అని వినిపిస్తున్నాడు.

"వాక్యం రసాత్మకం కావ్యం" అన్నప్పుడు కావ్యాంశం వాక్యంలో వుంటుందని అభిప్రాయం. యేకవాక్యమే కావ్యమైతే, మేఘసందేశాదులు మహామహాకావ్యాలు గావలెగదా. మేఘసందేశాదులు ఖండకావ్యాలని విశ్వనాథుడు చెప్పుతున్నాడు. మేఘసందేశంలోని ఒకశ్లోకమే కావ్యమైతే మేఘసందేశమంతా కలిసి ఖండకావ్య మెట్లా అవుతుంది? రసభావాలు పరిపోషంచెంది శ్రోతకు మనః పరిణతి కలిగించడంలో కావ్యత్వసిద్ది యేర్పడుతున్నది. చిరావస్థానం లేని అభిప్రాయాన్ని తెలిపే వకవాక్యంగాని ఒకమాటగాని అట్టాటిపనికి సమర్థంగావు. సాహిత్య గ్రంథాల్లో ఇది రసం, ఇది భావం, ఆని ఒక్కొక్కశ్లోకాన్ని ఉదాహరించడం, ఉపదేశోపాయమని తెలుసుకోవలెను. దాంట్లో రసాంశ, భావాంశ, వున్న దని తెలుసుకోవలెను. అదీ గాక ఈభావం, రసం. భావత్వంచేత, రసత్వంచేత, మాత్రమే గ్రాహ్యం గావు. ఆధారంయొక్క గుణగుణాలు ఆధేయంమీద ముద్రితమవుతున్నవి. ఈసంగతి ముందింకా స్పష్టంగా విశదీకరిస్తాను. రసం, భావం గ్రాహ్యంకావడానికి తదాధారమైన ఆలంబనం విదితమై అవి పరిపోషం చెందడానికి సాంగరూపసిద్ధి కలిగేవరకు ఉపస్థితంకావలెను. అప్పుడే మనకు ఉత్తమకావ్యం సిద్ధించగలదు. అట్లాకాక ఆ చిరావస్థానమైన ఒక అభిప్రాయానికి నాలుగైదు ఉదాహరణాలు వ్రాసి ఆ మాటలను ప్రత్యేకంగా ఒక పేజీమీద ముద్రించినమాత్రాన అది ఒకకావ్యంగాదు. అవి యింపుగావుంటే వాటిని కావ్యాంశగల చాటూక్తు లనవచ్చును. ఆమనోహరత్వం గూడా లేకుంటే అవి పనికిమాలిన ఛాందసపుమాట లవుతవి. కృష్ణపక్షంలోని విరిచేడె, విశ్రాంతి, శాపం, అబ్బ, తొలకరిలోని మరపు, గడ్డిపూలు, మొదటిముక్క, ఇట్లాటివన్నీ చాటూక్తులైనా అవుతవి. ఛాందసపు మాటలైనా అవుతవి. ఈకాలపుఖండ కృతుల్లో ఛాందసపుమాటలే