పుట:Neti-Kalapu-Kavitvam.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటి కాలపు కవిత్వం


రాత్రీకుంతలములలో
శిశిరమ్ములో!!

అని యిట్లా ఉదాహరణలు గుప్పించి, అది కావ్యమవుతుందని మురియడం అనుచితమైనవని.

ఆక్షేపం.

అవునయ్యా. "వాక్యం రసాత్మకంకావ్యం" అని విశ్వనాథు డన్నాడు. ఒక వాక్యమైనాచాలు, రసవంతమైనది. అదేకావ్యం. అనేక వాక్యాలు వుండవలసిన పనిలేదు. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను; వాక్యం రసాత్మకం కావ్యం అంటే మహావాక్యం అని అభిప్రాయం. లేదా రసాత్మక వాక్యం కావ్యాంశం అని అయినా అభిప్రాయం. మీరుచెప్పిందే ఆవాక్యానికి అర్థమైతే ఒకవాక్యం వ్రాసి కవిగావచ్చును.

వాక్యంతో గూడా పనిలేదు.

"తదదోపౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీపునః క్వాపి". (కావ్య) అని సాహిత్యవేత్తలంటారు.

శబ్దార్థౌ అంటే శబ్దం అర్థం రెండు అని అభిప్రాయం. శబ్దానికి అర్థం యెట్లానైనా వుంటుంది గనుక ఒక మంచిశబ్దం రచిస్తే చాలు. కావ్య మౌతుంది. రచయిత కవి అవుతాడు.

"మందః కవి యశః ప్రార్థీ"

అని కాళిదాసువంటివాడు చెప్పడం అనవసరం. ఇంతమంది ఇంత తేలికగా కవులవుతుంటే అతనికి జంకెందుకు? ఇందు వదన ఇది ఒకకావ్యం; సుందరాంగి ఒక కావ్యం; ఇందువదన కౌగిలియ్యవే సుందరాంగి, ముద్దుపెట్టవే; ఇవి రెండు మహాకావ్యాలు అని నిర్ణయించవచ్చును. కాని యివన్నీ తెలివితక్కువమాటలు, ఒక భావంగాని రసంగాని పరిపోషం చెందినప్పుడే కావ్యత్వ సిద్దికలుగుతున్నది. కాదా అవి కొన్ని మాటలే