పుట:Neti-Kalapu-Kavitvam.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నిదర్శనాధికరణం

నిదర్శనపరంపరలు.

విస్తరదోషంలో నిదర్శనపరంపర యిమిడివున్నా దీన్ని ప్రత్యేకించి తెలపవలసినంత హెచ్చుగా ఈ కాలపుకృతుల్లో వ్యాపించివున్నది.

ఈ దోషాన్ని వివరిస్తాను; ఒకసంగతిని స్ఫుటపరచడానికి నిదర్శనం చలా తోడ్పడుతుంది.

"క్వ సూర్య ప్రభవో వంశః క్వచాల్పవిషయా మతిః"
"తితీర్షుర్దుస్తరం మోహా దుడుపేనాస్మి సాగరం" (రఘు)
సూర్యప్రభవమైన ఆ రఘువంశ మెక్కడ?
అల్పవిషయమైన నామతియెక్కడ?
దుస్తరసముద్రాన్ని పుట్టితో దాటనెంచాను

అని అన్నప్పుడు కాళిదాసు చేయదలచినకార్యంయొక్క దుష్కరత్వం యెంతో హృదయంగమంగా వ్యక్తమవుతున్నది. ఇక పైననిదర్శనాలు చెప్పడం అధిక ప్రసంగమే అవుతున్నది.

భావం హృదయంగమంగాస్ఫుటపడ్డతరవాత దాన్ని యింకా చెప్పడం విసుగును రోతను పుట్టిస్తుంది. ఒకవస్తువును వెడల్పుగా పరచి సాగగొట్టిన కొద్దీదానికి బలంతగ్గి పలచబడిపోతుంది. భావాన్ని వ్యక్తదశకు తెచ్చి వదలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టికొట్టి వదలితే పలచబడి నీరసిస్తుంది. అందుకే నిదర్శనపరంపర దోషమని హేయమని చెప్పుతున్నాను. హేయం గనకనే కళాదాసాదులు ఉత్తమమార్గమవలంబించి భావవ్యక్తిచేస్తూ కావ్యసౌందర్యాన్ని మనకు ప్రసాదించారు.