పుట:Neti-Kalapu-Kavitvam.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిదర్శనాధికరణం

49


"దుస్తరసాగరాన్ని అజ్ఞానంచేత పుట్టితో దాటదలచాను" అని భావం వ్యక్తంచేశాడు కాని కొట్టికొట్టి

"హిమవత్పర్వతాన్ని చిన్ననిచ్చెనతో యెక్కదలచాను
 అఖండవాయుగోళాన్ని అరచేతితో పట్టదలచాను
 సముద్రసికతాకణాలనుసాంతం లెక్కించదలచాను"

అని యీతీరున ఉడుకుసోదిలోకి దిగలేదు.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం". (ఉత్తర)

(ఓప్రియురాలైనముగ్దా! అపూర్వకర్మ చండాలుణ్నీ నన్ను వదలు చందనవృక్షమనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు). అని భవభూతి శ్రీరాముడిచేత అనిపిస్తాడు. అంతేగాని సాగదీసి

"మణి అనుకొని మహోగ్రాగ్నినిచేపట్టినావు"
 

అని క్రూరసర్పాన్ని మెడవేసుకున్నావు"


అని వదరించడు

అసత్కావ్యమని అహోబలపండితుడన్న ముద్రారాక్షసంలొ సయితం కోపసంరంభసమయంలో కూడా

"ఆస్వాదితద్విరదశోణితశోణశోభాం
 సంధ్యారుణామివ కలాం శశలాంఛనస్య
 జృంభావిదారితముఖస్య ముఖాత్ స్ఫురంతీం
 కో హర్తు మిచ్ఛతి హరేః పరిభూయ దంష్ట్రాం" (ముద్రా)

(యేనుగునెత్తురు ఆస్వాదించి చంద్రుడి సంధ్యారుణకాంతివలె యెర్రగావున్న సింహపుకోరను ఆవలిస్తే బయటికి ప్రకాశిస్తున్న దాన్ని ఆసింహపునోటినుండి యెవడు పరాభవించి పెరకగోరుతున్నాడు) అని ఒక్క నిదర్శనంతోనే రాక్షససాహసికత్వాన్ని నిరూపిస్తాడు.

"నందకులకాలభుజగీం
 కోపానలబహుళనీల ధూమలతాం
 అద్యాపి బధ్యమానాం
 వధ్యః కో నామ నేచ్ఛతి శిఖాంమే" (ముద్రా)