పుట:Neti-Kalapu-Kavitvam.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

33


"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను"
                                   (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

"విబుధులందరు నన్ను విడిచిపోయినను
 హేతులందరును నన్ను నేవగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"
                      (గరిగపాటి రామమూర్తి - భారతి 2.11)

అని యీతీరున "నేను" అని ఉత్తమపురుషతో చెప్పడం కొత్త. వెనకటివాండ్లంతా యేనలుడిథనో చెప్పేవాండ్లు కాని యిప్పుడు నేను, నా, అని చెప్పుతున్నారు. ఇది కొత్తగాదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంబద్ధం ఇట్లాటి "నేను" పద్యాలు చిరకాలంనుండి వుంటున్నవి.

"జొన్నచేలోమంచి సొగసుకత్తెనుజూస్తి
 నిన్నటాలనుంచి నిరుదలేదు-"

"గొల్లవారీచిన్నది నన్ చల్లగుండూమన్నదీ"

"వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనో
 హరలోలాక్షులు చూప కవ్వలిమొగంబై నంత నేమాయె నీ
 గురుభాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు నాకుల జాల వేగంగ కి
 ద్దరిమేలద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా"- (చాటు)

"అవిదితసుఖదుఃఖం నిర్గుణం వస్తు కించిత్
 జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే
 మమ తు మతమనంగస్మేరతారుణ్యఘూర్ణ
 న్మదకలమదిరాక్షీనీవిమోక్షో హి మోక్షః"

(సుఖంగాని, దుఃఖంగాని విదితముకానటువంటి ఒక నిర్గుణవస్తువు మోక్షమని ఒక జడబుద్ది అన్నాడు. నామత మదిగాదు. వికసించే యౌవనంతో ప్రకాశిస్తూవున్న స్త్రీయొక్క నీవిమోక్షమే మోక్షమని నామతం.)