పుట:Neti-Kalapu-Kavitvam.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఆక్షేపం

అవునయ్యా మీ రిదివరకు కొత్తలేదని చూపినవన్నీ స్వల్పవిషయాలు అప్రధానవిషయాలు. వాటిలో కొత్తలేకున్నా మావాదానికి భంగంలేదు. నేటి కాలపుకవిత్వం వాస్తవంగా కొత్తది. వెనుకటికవులు ఆశ్వాసాలని, సర్గలని, కావ్యవస్తువును విభజించి పెద్దపెద్దకావ్యాలు వ్రాశారు కాని యెంకిపాటలవలె కధ కొంచెంగా సర్గవిభాగం లేకుండా కొద్దిపాటిగా భావమే ప్రధానంగా వ్రాసినకావ్యాలు లేవు. ఇవి యింగిలీషు లిరిక్సునుబట్టివ్రాసినవని వీటిలో భావోద్రేకం ప్రధానం. ఇట్లాటివి మనకు లేవు. ఇప్పటికవుల చిన్నకావ్యాలు యీలిరిక్కులకు చేరినవి వీటిని మేము భావకవిత్వమంటాము. ఇవి కొత్త, దీన్నికాదని మీరెంత యత్నించినా అనలేరు. అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను. ఈసంగతి ముందు విచారిస్తాను. దాన్నిప్పుడు నిల్పుతున్నాను.

ఆక్షేపం

"ఈదులాడంగవచ్చు మీయింటికెలని
 పంటకాలవ కొబ్బరిపాలలోన
 నొకరిపై నొకరము చేతు లుంచుకొనుచు
 ఇష్టపడెదవు నీతోడ నేనుగూడ
 పూని చనుదెంతు నీసన్నిధానమునకు
 మరువకే నెచ్చెలీ నన్ను మరువబోకు"
                               (గిరికుమారుడు.సాహితి)

"సుందరాంగుల నెందర జూచియున్న
 జానకీ ఆత్మ నిల్పు నీయానవంబె
 తరుణి నాచిత్త మనియెడు దర్పణమున
 బింబితంబగు నీముఖ బింబమెపుడు"
              (అధికార్ల సూర్యనారాయణ - భారతి సం.2 సం.2)