పుట:Neti-Kalapu-Kavitvam.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఈతీరుగా రోతలోకి దిగి యీనాడు మెండైనవి ఇట్లాటివి యేకాలంలో నైనా సరే అల్పబుద్ధిత్వ సూచక మేగాని పరిణతిద్యోతకంగావు. కవికుల గురువు కాళిదాసు.

"మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతాం" (రఘు)

(మందుడను కవియశస్సునుగోరి అపహాస్యతను పొందుతాను) అని విజ్ఞలోకానికి వినతుడవుతున్నాడు.

అంతేగాని పికకుమారుణ్ణి కోయిలను, చిలకను అవి పాగడుకోలేదు. ఈ ఆత్మస్తుతి అధములుగూడా చేసుకోవచ్చును. మహాకవులను లోకం స్వయంగానే ఆరాధిస్తున్నది.

"వందే వాల్మికికోకిలం"
"పురా కవీనాం గుణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసా
 అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ"
"దాసతాం కాళిదాసస్య కవయః కే న విభ్రతి"
                                               (గంగాదేవి - మధురా)
"నిర్గతాసు నవా కన్య కాళిదాసస్య సూ క్తిమ.
 ప్రీతిర్మధురసార్ద్రాసు మంజరీష్వివ జాయతే. (హర్ష - బాణుడు)
"శ్లోకత్వమాపద్యత యస్య శోకః" (రఘు - కాళిదాసు)

అని మహాకవులు నాటికి నేటికి ఆరాధితులవుతున్నారు. అనుచితమైన ఆత్మస్తుతులు అల్పబుద్ధిత్వసూచికమని అది కొత్తకాదని చెప్పి యీ విమర్శ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

"పూర్వులాశ్రయించిన పద్యములు ముఖ్యముగా వృత్తములు కందములు ఇప్పటినవకవులకు విశేషముగా యోగ్యమయినవి గీతములు, ద్విపదలు" అని లక్షీకాంతతొలకరి పీఠికాకర్త శ్రీ రామలింగారెడ్దివారు వ్రాసినట్లు యిదివరకు చంపకమాలలు మొదలైనవి వ్రాసే వారు. యిప్పటి కవులు గీతాలు ద్విపదలు వ్రాస్తున్నారు యింకా ముత్యాల సరమువంటి వెన్నోకొత్తవి వ్రాస్తున్నారు. యీతీరుగా పద్యాల్లో కొత్తకనబడుతున్నది కనుక యిప్పటి కవిత్వం కొత్తఅంటామంటారా