పుట:Neti-Kalapu-Kavitvam.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఆక్షేపం

అవునయ్యా.

"కవితాకన్యా వృణీతే స్వయం" (బిల్హ)
"కాంతా సమ్మితతయోపదేశయుజే" (కావ్య)
"నవపల్లవ కోమల కావ్యకన్యకన్" (కేయూర)

అని యిట్లా కవ్యాన్ని కన్యతో పోల్చడం భారతీయసంప్రదాయం కావ్యం కన్యవలె మృదువైంది గనుకను రమణులు మెత్తమెత్తటి మాటలాడుతూ మెత్తగావుండడం అందరికీ ఆహ్లాదకరమే గనుకను కావ్యంగూడా అట్లానే ఆహ్లాదకరమై వుండడానికి అంతటా మెత్తమెత్తంగా మెత్తమెత్తటి మాటలతో నిండివుండడం ఆవశ్యకమే అవుతున్నది అని అంటారా

సమాధానం

సాదృశ్యవిచారణ

వివరిస్తున్నాను. "కాంతేవసరసతాపాదనేన అభిముఖీకృత్య" అని మమ్మటుడు చెప్పినట్లు సరసత్వాపాదనం చేతశ్రోతను అభిముఖుణ్ని చేసేమటుకే కన్యతో సాదృశ్యంగాని కన్నెవలె మెత్తగామెత్తగావుంటుంది. రవికతొడుక్కొంటుంది అని సర్వాంశాలా సాదృశ్యం చెప్పగూడదు. ఆమె ముఖం చంద్రుడివలె వుంటుందంటే చంద్రుడివలె సౌమ్యం. కాంతిమత్త్వం కలిగివుంటుందని అభిప్రాయంగాని చంద్రుడివలె గుండ్రంగా ముక్కూ కండ్లూ లేకుండా చెక్కినట్లు వుంటుందని భావంగాదు. అట్లాసర్వ సాదృశ్యం చెప్పితే ఉపమానోపమేయభావంపోయి రెండూ ఒకటేననవలసివస్తుంది. కొంతభేదం కొంతసాదృశ్యం వున్నప్పుడే ఉపమానోపమేయ భావం సంగతమవు తున్నది. కనుకనే సాదృశ్యం భేదవిశిష్టమై వుంటుంది. ఈవిషయాన్నే శ్రీశంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రబాష్యంలో ఉపాదిగతమైన ఆత్మకు జలసూర్య కాదితుల్యత్వాన్ని సిద్దాంతీకరిస్తూ.

"అత ఏవ చోపమా సూర్యకాదివత్."
"అంబువదగ్రహణాత్తు న తధాత్వం." (బ్ర. సూ)