పుట:Neti-Kalapu-Kavitvam.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

11


సమాధానం

చెప్పుతాను. మీరన్నమాటసరిగాదు. దివ్యం, ప్రణయం, లలితం మొదలైనవి వెనకటి కావ్యాల్లోను వున్నవి.

"దివ్య విషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ"(భీమకవి చా)

"ఆనందో బ్రహ్మయటన్న ప్రాఁజదువు నంతర్బుద్ది నూహింపుమా" (మను)

"కరస్థదర్భ ప్రణయాపహారిషు" (కుమార)

"ప్రణయవిశదాం దృష్టిం దదాతి" (రత్నా)

"ప్రణయకుపితాం" (శ్రీముంజుడు దశారూపకంలో ఉదాహృతం)

"లలితైణాంక శిలాలవాల" (వసు)

"కన్నెమావిగుంపున" (వసు)

"లేఁగల్వ తూపునకు" (వసు)

"కలికి కోయిలగళగ్రహము సేయకమున్న" (వసు)

"నూతన లతికాలతాంగులను" (వసు)

"చూతాంకురాస్వాదకషాయకంఠః

పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (కుమార)

"చరుణా మృరితేనాయ మపరిక్లతకోమలః.

పిపాసతో మమానుజ్ఞాం దదాతీవ ప్రియాధరః"" (శా)

ఈ తీరుగా ఇట్లాటి శబ్దాలన్నీ వెనకటి కావ్యాల్లోను వున్నవి. లతాంగనలు వసుచరిత్రలో వున్నారు. అవునయ్యా వెనకటికావ్యాల్లో లేవని అనలేదు. ఇప్పటికావ్యాల్లో యెక్కువగా ఉన్నవి.

"ప్రణయ మలయానిలోర్మికా పటలినూగు
 ప్రణయ నీరజ మధుర సౌరభముగ్రోలు
 ప్రణయ విమలాంబరాబ్ధి గర్భమునఁదేలు
 ప్రణయ వనతరు శాఖలం బల్లవించు" (కృష్ణపక్షం)

"మధుర చంద్రికలలో మధురామృతంబు
 మదురామృతంబులో మదురరసంబు
 మధురరసంబులో మధురభావంబు" (యేకాంతసేవ)