పుట:Neti-Kalapu-Kavitvam.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశాధికరణం

265

(కావ్యంలో దోషం కొద్దిదైనా ఉపేక్షించరాదు. శరీరం సుందరమైనదైనా ఒక్కకుష్ఠంచేత దుర్భరమవుతున్నది)

అని దండి అంటున్నాడు.

"సభాం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం నా సమంజసం
 అబ్రువన్ విబ్రువన్ వాపి నరో భవతి కిల్బిషి" (మను)

(సభలో ప్రవేశించరాదు. ప్రవేశించిన తరువాత సత్యమే తెలుపవలెను. అసలు చెప్పకున్నా, వక్రమార్గంలో చెప్పినా నరుడు పాపి అవుతున్నాడు.) అని మనువుచెప్పుతున్నాడు. పులుముడు, అయోమయం, క్షుద్రశృంగారం మొదలైనవాటిచేత లోకం వంచిత మవుతున్న దని తెలిసినప్పుడు సత్యప్రకటనం ధర్మమని అనుకొంటున్నాను. ఇకగుణాలవిషయం నాకు కనబడ్దవరకు చెప్పినాను. మరేవైనా గుణాలువుంటే యెవరైనా చెప్పితేవింటాను. అవి దోషాలని స్థిరపడితే అవిదోషాలని విన్నవిస్తాను. గుణాలైతే సంతోషిస్తాను. మనవారు పరిణతబుద్ధులై సంస్కారపరిపాకంతో గుణవత్కావ్యాలు రచిస్తే యెవరికి ఆనందదాయకంగాదు?

అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలోవాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ప్రకాశాధికరణం సమాప్తం.