పుట:Neti-Kalapu-Kavitvam.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"కమ్మవారి చిన్నదాని నయ్యానేను
 జొన్నకోత కోస్తావ పిల్లానీవు"
 సన్నాసన్నాగాజులేవే నారాయణమ్మా
 నీచిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా"

అని నారాయణమ్మ నాయుడుబావపాటలోను లక్ష్మి అనేకథలోను వుండే మంచిమాటలు జారకాంత సౌశీల్యంవంటివి గనుక విచార్యం గావని చెప్పి యీచర్చ ముగిస్తున్నాను.

"మా అభినవాంధ్ర కవిమిత్రమండలి వారందరు నాప్రాణ మిత్రులు" అని యెంకి పాటలకర్త తెలిపిన అభినవాంధ్రకవిత్వ మిదే అయితే దీంట్లో వున్నది ఆధునికత్వంగాని అభినవత్వం గాదని దీన్ని అభినవమన్నా ఆధునికమన్నా యిట్లాటివి చిరకాలంనుండీ వున్నవని ఇవే ఉత్తమ కవిత్వమనుకొనడం అజ్ఞానమని ఈ ఆధునిక కవిత్వం చాలవరకు దుష్టమని ఈకృతుల్లో చాలామట్టుకు శృంగారం చిల్లరశృంగారమై క్షుద్రమైనదని ఈరకపు క్షుద్రకవిత్వానికి చేరినయిట్లాటి మండల్లు అంతగా శ్లాఘ్యమైనవి గావని ఇది కవిమిత్రమండలి అయినప్పుడు ఈకవులను ఉత్తమ మార్గాలకు ప్రేరించడం ఈ మిత్రుల ధర్మమై వుండగలదని చెప్పుతున్నాను.

అని శ్రీ- ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్రపరిశిష్టంలో

అనౌచిత్యాధికరణం - సమాప్తం