పుట:Neti-Kalapu-Kavitvam.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

221


మావోడి మనసట్టె మరుగుతాదమ్మా
పండు యెన్నెల్లోన పక్కకేసినసాప
పందిరీమంచమైనాదే చంద్రమ్మ (యెంకయ్యపాట)
పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
నీలిసీరాగట్టినీటుగొస్తావుంటె (యెంకిపాట)
"మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సందురుణ్నీ తిట్టునాయెంకి
సూరియుణ్ణీ తిట్టునాయెంకి"
"బద్రాసెలంనేను బయలెల్లిపొతాను
నువ్వుగూడా యెంటరారో రెంకయ్య"
                                         (యెంకయ్య చంద్రమ్మ)
"పడవెక్కి బద్రాద్రిపోదామా
బద్రాద్రి రాముణ్ని సూదామా" (యెంకిపాటలు)
"సిమ్మాచలపుసామి సేవించుకొత్తాము
కొంపగోడూయిడిసిరారో రెంకయ్య
అంపకాలేసెప్పిరారో రెంకయ్య"
                                  (యెంకయ్య చంద్రమ్మపాట)
"ఆవుల్ని దూడల్ని అత్తోరికాడుంచి
మూటాముల్లీగట్టి ముసిలోళ్లతో సెప్పి
యెంకీ నాతోటిరాయే మన యెంకటేశ్వరుణ్ని
యెల్లి సూసొద్దాము" (యెంకిపాట)

అని యిట్లా తిరణాలవేడుకలు కొన్ని యింపైనమాటలు తీర్థయాత్రా ప్రశంసలూ వున్నా అసలీకృతులే క్షుద్రశృంగారం గనుక

"వపుష్యలలితే స్త్రీణాం హారోభారాయతే పరం"

అన్నట్లు ఇవి కృతులకు ఉపాదేయత్వం తేజాలవు.