పుట:Neti-Kalapu-Kavitvam.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


భంగమయి గోరుచుట్టుమీద రోకటిపో టన్నట్లు క్షుద్రత్వానికి అనౌచిత్యం చేరిందని విశదీకరించాను. ఇట్లానే వెంకయ్య చంద్రమ్మ పాటలోను

"యెందులో జూచినా యెలుతురుండాదంట
 యెరిగితేసూపించిపోరో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య||
 సప్తసముద్రాల్లో సారముంటాదంట
 తెచ్చి పెడుతువుగానిరారో రెంకయ్య
 లేకుంటె నిన్నుడువలేరా వెంకయ్య||
 తెలిసందమామలో తియ్యపానకముంది
 తెచ్చిపెడుదువుగాని రారో రెంకయ్య
 లేకుంటె నిన్నిడువలేరా యెంకయ్య॥

అనేవి అనౌచిత్య ప్రతిపాదకాలని తెలుసుకోవలెను. ఇక

"శిరసునామీదేసి సిరునవ్వునవ్వితే
 సింతలన్నీ మరిసినావే చంద్రమ్మ"
                                     (యెంకయ్య చంద్రమ్మపాట)
"యెంకిగాలొక సారి యిసిరినాసాలు
 తోటంతరాజల్లె తొవ్విపోసెను." (యెంకిపాటలు)
"నీనీడలోపలా దేవుడుండాడంట
      నానీడలోగలిసిపోరా వెంకయ్య" (యెంకయ్య చంద్రమ్మ)
"నీనీడలోనే మేడకడత నాయుడుబావా" (యెంకిపాట)
 నీవొళ్లు నావొళ్లు నిజముగావొకటైతె
 పైనసుక్కలు నవ్వినాయే చంద్రమ్మ
 పాపచంద్రుడు నవ్వినాడే చంద్రమ్మ
                                    (యెంకయ్య చంద్రమ్మపాట)
"సెంద్ర వొంకలొ యేమి సిత్రమున్నాదే
 వొంకపోగానె మావోడొస్తడమ్మా (యెంకిపాట)