అనౌచిత్యాధికరణం
213
సిద్ధాంతం
వ్రాస్తున్నాను; ఈఅనౌచిత్యాని కెట్లావున్నా యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు ఇట్లాటివాటి క్షుద్రత్వానికిగూడా వీటినాయకులు సంస్కారహీనులని చిల్లరమనుషులని విశదపడడం అవసరం గనుక యెంకిపాటలు ఉదాహరణంగా ఈవిషయం వివరిస్తాను. శ్రీనాథుడు "కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి, శ్రీనాథుడునువాడ శివభక్తిపరుడ" అని తన భాషను అంతటా ప్రదర్శిస్తాడు. ఈ భాషనే పాత్రలకుగూడా వాడుతాడు అప్పుడది కవిభాషగాని పాత్ర భాషగాదని స్పష్టంగా తెలిపిన వాడవుతున్నాడు. అదిగాక కవిభాష
"ప్రభువులలో మాప్రభువులును కవులూ రసికులూ
అయిన శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు
బహద్దరుగారు యీపాటలు విని ఆనందించేవారు.
వారి వంశ మాచంద్రార్కము నిలుచుగాత మని పరమేశ్వ
రుని ప్రార్ధిస్తున్నాను. మా ప్రెసిడెంటుగారు శ్రీయుత
కోలవెన్ను రామకోటీశ్వరరావుగారి ద్వారా వారి
దయకు బదులు నావందనము లర్పిస్తున్నాను"
అని కవి తన భాషను ఉపోద్ఘాతంలో వ్రాశాడు.
"వస్తుండగా". (ఉపోద్ఘాతం.)
"నీటుగొస్తావుంటె". (యెంకిపాట.)
అని యిట్లా కవిభాషా పాత్రభాషా భిన్నంగావున్నవి. ఇంతకూ యెంకిపాటల్లో పాత్రలే మాట్లాడుతారు. కనుక యీపాటల్లో వున్నది పాత్రభాషే నంటున్నాను.
పూర్వపక్షం.
అవునయ్యా; నాటకాల్లో రాజుకు సంస్కృతంవాడుతారు. అయితే ఆరాజు సంస్కృతం మాట్లాడుతాడని అర్థమా? నాటకంలో కవిచెప్పేది