212
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
ప్రవర్తిస్తుంటారు. కాని పరిణతుల కవి వొక్కొక్కటే అనేకవిధమైన విచారణలకు విషయాలై సత్యాలుతిరిగి ఆభిన్నత్వాలఐక్యం వాయువుయొక్క విభుత్వం, ఆశ్లేషాయోగ్యత్వం ఇవన్నీ పరిణతబుద్ధుల మనో వ్యాపారాల విషయాలు కనుకనే ఇవి ఈయెంకిపాటలనాయకులకు అనుచితమని ఈ అనౌచిత్యం గోరుచుట్టుమీద రోకటిపోటువలె క్షుద్రత్వానికి తోడయిందని చెపుతున్నాను.
పూర్వాపక్షం
అవునయ్యా ,కావ్యంలో
"భటవృత్తివాడవై పల్కితి విట్లు
కామభూపతిపాద కమలంబులాన
కరిచేత త్రొక్కింతు గట్టిగా నిన్ను
భట్టువాడవుగాన బ్రతుక నిచ్చితిని.
...... ........ ........ ......... .........
మశకాళితేనెలో మడిసినరీతి
మిడుతలు చిచ్చులో మిడిసిపడ్డట్లు
మాచేత చచ్చును మన్నీలుబలము" (పల్నాటివీరచరిత్రం)
అని నాయకురా లన్నట్లు శ్రీనాథుడువ్రాశాడు. అయితే నాయకురాలు ఆభాష మాట్లాడిందని యెవరనగలరు? కవి అట్లా వ్రాస్తాడు. కవిశిల్పి. అతనికిష్టమైన భాషలో వ్రాస్తాడు. అది ఆపాత్రలభాష అని అనుకోగూడదు. కనుక రామకృష్టాయనీ "సీకటై లచ్చిమి సెందురుణ్ణి, సూరెయుణ్ణి" అని యీతీరున కవి వ్రాశాడని అవే నాయకుడిమాట లని అనుకోగూడదు. కనుక ఆమాటలు ఆధారంగా నాయకుడు సంస్కారంలేని మోటువాడని నిశ్చయించలేము అని అంటారా?