పుట:Neti-Kalapu-Kavitvam.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వుండదుగదా. అంతా పాత్రసంభాషణమేగదా అయినప్పటికీ ఆసంభాషణలవల్ల అది ఆపాత్ర నిత్యవ్యవహారంలో వాడేభాష అని నిశ్చయించలేకున్నాము. అది కేవలం కవిసమయాన్ని అనుసరించి యేర్పడ్డభాష కనుక పాత్రలసంభాషణం అన్నమాత్రాన అది వారినిత్య వ్యవహారభాష అని చెప్పలేము గనుక

"కూకుండనీదు"

"సెందురుణ్ణి"

ఇవి నాయకుడి నిత్యవ్యవహారభాష అని నిర్ణయింపలేము. ఆమాటలవల్ల అతడు చదువురాని మోటువాడనడం సాధ్యసమమనే హెత్వాభాసం. నీడద్రవ్యం, చలనమున్నదిగనుక; అనే ఉదాహరణంలో వలె ఋజువుచేయవలసిన ఒక అంశానికి అట్లానే యింకా ఋజువుచేయవలసిన మరియొకఅంశాన్ని హేతువుగా చెప్పడం సాధ్యసమం ఇట్లాటిదాన్నే Fallacy of Undue Assumption అని పాశ్చాత్యతార్కికులంటారు. ఇక్కడ నాయుడు చదువురానివాడనడం ఋజువు చేయవలెను. "కూకుండనీదు" "సెందురుణ్నీ" ఇవి ఆతని నిత్యవ్యవహారభాష గనక అనడం హేతువు. ఇవి అతడినిత్యవ్యవహారభాష అనడం కూడా ఋజువు కావలసిన అంశమే. అది ఇంకా ఋజువుకాలేదు. కనుక ఇట్లాటిదాన్ని సాధ్యసమమనే హేతువుగా హేత్వాభాసమని వైయాయికులు నిరూపించారు. ఈ తీరుగా హేత్వాభాసాన్ని స్వీకరించి నాయకుడు చదువురాని మోటువాడంటే మేమొప్పుకోము అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; నాటకంలో పాత్రలసంభాషణం పాత్రల నిత్య వ్యవహారసంభాషణం కాదనడం అసంబద్ధం. పాత్రలకు ఉచితమైన భాష వుండవలెననే వుద్దేశంతోనే రాజు మొదలైనవారికి సంస్కృతం నీచులు మొదలైనవారికి ప్రాకృతభేదాలను తత్తద్దేశాల ననుసరించి చెప్పవలె నని భారతీయసాహిత్యవేత్త లంటున్నారు.