పుట:Neti-Kalapu-Kavitvam.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

207

వనకుమారి అనే ఖండకావ్యంలో ఒకక్షత్రియుడు రాజ్యం గోలుపోయి అడవిలో తనకూతురితో నివసిస్తుంటాడు. తండ్రిని తప్ప ఆపిల్ల మరి యేపురుషుణ్ని యౌవనం వచ్చేదాకా యెరగదు. ఆపిల్ల గొర్రెలుకాస్తూ కొండలోయల్లో తిరుగుతుంటే ఒకక్షత్రియకుమారుడు కనబడతాడు తరువాత కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడతారు. వనకుమారి తండ్రి చచ్చి పడివున్నసమయాన వనకుమారి ఒకపక్కన నిద్రిస్తుంటే యీక్షత్రియుడు

"సరసీలోలతరంగడోలల శరచ్చంద్రాంశు పూరంబురౌ
 ప్యరమం జిల్కగ బాలశైవలపుదీవల్ గ్రాలు నున్బాన్పునన్
 నెరయందూగు మరాళబాలికవలెన్ నిర్మాయికాస్యంబుతో
 హరిణీలోచన నిద్రవోయెడిని"

అని

"మంజిమజిల్కు కపోలపాళుల జికురములాక్రమించ సరసీరుహలోచన"

అని ప్రియురాలిని వర్ణిస్తాడు వర్ణించి

"ఈ రాజమనోహరాస్యకరిరాజసమంచితయానప్రేమకున్
 భాజనమైధరాభరణ భవ్యసుఖంబుల నెల్ల నేడే సం
 యోజనముం బొనర్తు"

అని అంటాడు.

ఈచావుదశలో ఈతడి మన్నథవికారం మిక్కిలి రోతగదా అందులో "ఆలు గొర్రెలు గాస్తురున్నారడం అవివేకం. రాజ్యమంతా పోయి అడవికి వస్తూ గొర్రెలునెత్తిన పెట్టుకొని రాజువస్తాడనడం అంతకంటె అవివేకం. ఇట్లాటి అప్రశస్తాలు దేశాన్ని పాత్రాన్ని దశను తెలిసికొన్నవివేకంతో వ్రాసిన అంశాలుగావు.