పుట:Neti-Kalapu-Kavitvam.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఇట్లానే షేక్స్పియరునాటకాల్లో తండ్రినితప్ప పరపురుషుణ్ని యెరగకుండా వున్న ఒక కన్య కథ వున్నది. అనుకరించవలననే వుత్సాహంలో వనకుమారికర్తకు వివేకంపోయింది. ఇట్లానే మరికొందరు పాశ్చాత్యులను మొదలైనవారికని అనుకరించబోయి పులుముడు అయోమయం చిల్లరశృంగారం వీటితొ కూడిన క్షుద్రకృతులు రచించారు. వనకుమారికర్త యింకా భారతవర్షానికి పాత్రలకు తగని వ్యవస్తా చేష్టలు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యంపాలుచేశాడు. దీంట్లో పాత్రలు ఒకరితోనొకరు మాట్లాడేటప్పుడు యేకాంతంగా మాట్లాడేటప్పుడు ఆఅవస్థకు ఆప్రకృతికి తగని అనౌచిత్యాలింకావున్నా గ్రంథవిస్తరభీతిచే చర్చించక వదులుతున్నాను. కూచినరసింహకృతి వనవాసిలో పావకుడు బాల్యంగడవగానే వనంలోకి పోయి సన్యాసిఅవుతాడు. ఇతడికి చిదానందుడు గురువు. వనంలో తిరుగుతుంటే ఒకదేవదూత కనబడతాడు. మర్రిచెట్టుకు చిన్న కాయలుంటే ఆసంగతినిగురించి జిజ్ఞాస ఆరంభిస్తాడు. చిరకాలంనుండి ఉపనిషత్కర్తలు బాదరాయణుడు, బోధాయనుడు, బారతవర్షారణ్యాలను బ్రహ్మతేజస్సుతో నింపిన యెందరో మహాతపశ్శాలులు, తెలిపిన కర్మతత్వం బ్రహ్మతత్వం, జీవాత్మ పరమాత్మల భేదాభేదం, శమదమాది వైరాగ్య సాధనసంపత్తీ యివన్నీ జగద్విదితమై వుండగా యీసన్యాసి అవన్నీ తెలియక లావుకాయ యెందుకు పుట్టలేదనే వేదాంతవిచారణం చేస్తున్నాడు. ఇట్లాటిదాన్నే చొప్పదంటు శంక అని మన ఆంధ్రదేశపువిజ్ఞులు అంటారు. గురువు శిష్యుడికి ఉపదేశిస్తుంటే అదంతావినక బర్రెదూడ చొప్పదంటుతినడంచూచి యింతపొడగుదంటు ఆ కాస్త దూడకడుపులొ యెట్లాపడుతుందని శంకించాడట. ఈమర్రికాయశంక ఆరకంలోనే చేరుతున్నది. ఈసన్యాసి లావుకాయలేకాస్తే మనుషుల మీదపడి చావరా అని మర్రికాయశంకకు దేవదాత సమాధానం చెప్పుతాడుకాని లావాటికాయలుకాసే పెద్దచెట్లెన్నో వున్నవి. బెజవాడలో గవర్నరుపేట రోడ్దుమీద వీటిని చూడవచ్చును. కొబ్బరిచేలకు లావాటికాయలున్నవి ఈ సన్యాసి యెంతటివాడో