పుట:Neti-Kalapu-Kavitvam.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

వాఙ్మయ పరిశిష్టబాష్యం - నేటికాలపుకవిత్వం


"సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
 గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠః సత్రీనేతాన్ బిభర్తిహి
 యథా నదీనదా స్సర్వే సాగరే యాంతి సంస్థితిం

 తదైవాశ్రమిణస్సర్వే గృహస్థే యాంతి సంస్థితిం"

(మను)

(వేదస్మృతి విధానంవల్ల యీ అన్ని ఆశ్రమాల్లో గృహస్థుడే శ్రేష్ఠుడని చెప్పబడుతున్నాడు. తక్కిన మూడు ఆశ్రమాలవారిని యితడే భరిస్తున్నాడు. నదీనదాలన్నీ సముద్రంలో యెట్లా సంస్థితిని పొందుతున్నవో అట్లానే తక్కిన ఆశ్రమాలవారు గృహస్థుడియందు సంస్థితిని పొందుతున్నారు) అని మనువు కీర్తిస్తున్నాడు.

"భవేద్ధర్మపరాయణ:"

(నీభర్త ధర్మపరాయణుడు కావలసినది) అని స్త్రీలను ఆశీర్వదిస్తున్నారు.

వివాహానికి ఫలం ధర్మం వీరసంతతి. అంటే వీరావిచ్చిన్నత.

"పనసదొనలవంటి బిడ్దలు కనడానికా నీనోము" అని మూగినోములో అధికార్ల సూర్యనారాయణవారు అన్నట్లు పనసదొనల వంటి శిశువులను కనమని భారతీయులు దీవించరు.

"వీరపసవినీ భవ"అని దీవిస్తున్నారు.

ధర్మావలంబనమైన వీరసంతతిని అవిచ్ఛిన్నంచేసేది గార్హస్థ్యమని బారతీయులభావం.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం."

అని యిదివరకు నేను వుదాహరించిన కాళిదాసువాక్యాలు గార్హస్థ్యంలోని యీధర్మోన్ముఖత్వాన్నే ప్రశంసిస్తున్నవి.

"కామాత్మతా న ప్రశస్తా నచైవేహాస్త్యకామతా" (మను)