పుట:Neti-Kalapu-Kavitvam.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


విదితభక్తిని నన్ను మహర్షికి ఆమె తెలుపుతుందిగదా.)

"తపోవన నివాసినాం ఉపరోధో మాభూత్"

(తపోవననివాసులకు ఉపరోధం కలుగకుండును గాక) అని యీతీరున వ్యక్తపరుస్తాడు. ఉత్తరరామచరిత్రలో భవభూతి విప్రలంభ శృంగార నాయకుడైన శ్రీరాముడి ధర్మతత్పరత్వాన్ని

"స్నేహం దయాంచ ప్రీతించ యదివా జానకిమపి
 ఆరాధనాయ లోకానాం ముంచతో నాస్తి మే వ్యధా." (ఉత్తర)

(ప్రజలను ఆరాధించడానికి స్నేహాన్నివిడిచినా దయనువిడిచినా ప్రీతిని విడిచినా, చివరకు జానకిని విడిచినాగూడా నాకు చింతలేదు.) అని వినిపిస్తాడు. కాదంబరిలో బాణుడు శృంగారసందర్భ లో అంగకథలో వచ్చే పుండరీకుడివిషయాన సయితం పవిత్రగుణధర్మాలను ప్రస్తావిస్తాడు.

మహోశ్వేతమీదివాంఛచేత పుండరీకుడు మృతుడుకాగా

"హాధర్మ! నిష్పరిగ్రహోసి, హాతపోనిరాశ్రయమసి, హాసర స్వతి. విధవాసి, హాసత్వం అనాథమసి." (కాదం)

(హాధర్మమా! నిష్పరిగ్రహమైనావు. హాతసస్సా! నిరాశ్రయ మైనావు. హాసరస్వతి! నీనాథుడు పోయినాడు. హాసత్యమా! అనాధ మయితివి" అనే కపింజలవిలాసంలో పుండరీకుడి సత్యధర్మ పరత్వాది గుణాలను విశదీకరిస్తాడు.

ధర్మం అనంతరూపమైనది తపస్సు, దయ, సత్యం, అహింస, పరదారవిముఖత్వం, పరధనపరాఙ్ముఖత్వం సత్కార్యదీక్ష మొదలయిన అనంతరూపాలతో ధర్మదేవత వెలసివున్నది. మాధవుడు చారుదత్తుడు అగ్నిమిత్రుడు చంద్రాపీడుడు అందరు ధర్మసంబంధంగల వారే అయివున్నారు. మృచ్ఛకటికలోని చారుదత్తుడి ధర్మపరతంత్రత్వం మొదలైనవి వివరించడం గ్రంథవిస్తరహేతువని వదలుతున్నాను.