పుట:Neti-Kalapu-Kavitvam.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

వాఙ్మయ పరిశిష్టభాష్యం నేటికాలపుకవిత్వం


"ప్రళయ కాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులతో
 ప్రబలనీరంధ్రాభ్రజనితగాఢధ్వాంత
 నిబిడ హేమంత రాత్రీకుంతలములలో
 వికృత క్రూర క్షు భితమృత్యుకఠోర
 వికటపాండుర శుష్కవదన దంష్ట్రాగ్నిలో|| (కృష్ణపక్షం)

"నైదాఘతీక్ష్ణ భ్ణానుభీకరకరానలచ్చట"
"అనంతశోక భీకర తిమిర లోకైకపతిని"
"వెక్కి వెక్కి రోదింతును"
"ఏడ్చివైతు ఎలుగెత్తి ఏడ్చివైతు"

ఈ తీరుగా యేడవకుండానే యేడుస్తానన్నట్లు శబ్ధవాచ్యత అనే దోషానికి కృష్ణపక్షకర్త తనకృతులను గురి చేశాడు.

"ప్రణయమేలోకమై పరగిన చోట
 ప్రణయ శకుంత దంపతులమై మనము
 ప్రణయలీలామృత రసతరంగముల
 ప్రణయడోలా పరంపరల మధ్యమున
 ప్రణయాన దోగుచు ప్రణయగీతములు
 ప్రణయంబు పల్లవింపఁగఁ బాడుకొనుచు
 ప్రణయ రూపానంద భాగ్యంబు గాంచి
 ప్రణయ శాసనమున ప్రణయ రాజ్యమ్ము
 పాలింతమికరమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)