పుట:Neti-Kalapu-Kavitvam.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


అని ఆనందవర్ధను డంటున్నాడు.

ఇట్లానే తక్కిన సాహిత్యవేత్త లందరు చెప్పుతున్నారు; కాళిదాసాదుల కావ్యాలీ ఉత్తమత్వాన్నే పొందివున్నవి. ఆకాలంనాటికి వికసితమైన సర్వవిజ్ఞానం బలప్రదమై వుండగా సర్వభావాలకు మొదట వశుడై పిమ్మట సర్వభావాలను వశంచేసుకొని సత్వతేజస్సుతో వెలసే దశయందే ఈఉత్తమకవితాసిద్ధి కలుగుతున్నది, ఇట్లాటి కవితాదశ సర్వ --లోనే కాళిదాసాదుల కేకొద్దిమందికో తప్ప మిక్కిలి అరుదుగా గోచరిస్తున్నది. కనుకనే--

"నరత్వం దుర్లభం లోకే విద్యా తత్ర సుదుర్లభా,
 కవిత్వం దుర్లభం తత్ర శక్తి స్తత్ర సుదుర్లభా." (అగ్నే.)

అని ఆగ్నేయపురాణకారు డన్నాడు.

"యేనాస్మిన్నతివిచిత్ర కవిపరంపరావాహిని సంసారేకాళిదాస
 ప్రభృతయోద్విత్రాః పంచషావామహాకవయ ఇతి గణ్యన్తే"
                                                              (ధ్వన్యా)

(ఈ అతివిచిత్ర కవిపరంపరా చక్రంలో కాళీదాస ప్రభృతులు ఇద్దరు ముగ్గురు లేదా అయిదారుగురు మాత్రమే మహాకవులని పరిగణితులవుతున్నా రు.)

అని అన్న ఆనందవర్ధనుడు ఈ అభిప్రాయాన్నే తెలుపుతున్నాడు.

"కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ,
 పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితం."

(కాళిదాసాదులూ కవులు, మేమూ కవులమే పర్వతమూ పదార్థమే, పరమాణువూ పదార్థమే.)

అని కవితాతత్వజ్ఞులంటున్నారు.

"పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధిష్ఠితకాళిదాసా.
 అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ."