పుట:Neti-Kalapu-Kavitvam.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయోమయత్వాధికరణం

73



బ్రహ్మ విష్ణు రుద్రుల బరిత్యజించి
అగ్నిముఖమున బురుషుని నరయుమనుచు" (భారతీ.ధ్యానగీత)

అని ధ్యానగీత కర్త అన్నాడు.

అగ్నిముఖాన ఆరయమంటే యజ్ఞంచేయమనా? అగ్నిలోనిల్చోని తపస్సుచేయమనా? పార్శీలవలె అగ్నిపూజచేయమనా? అగ్నిలోవుండే జ్యోతిస్సునే బ్రహ్మమనుకోమనా? బ్రహ్మమునకు అగ్ని ముఖమనా? చెప్పదలచినది స్పష్టంగా చెప్పగల బలంలేని భీరుత్వంవల్ల యిట్లాటి అయోమయపు ధోరణి దిగుతున్నది.

"కలవిహంగమ పక్షముల దేలియాడి
 తారకామణులలో దారనై మెరసి
 మాయమయ్యెదను నామదురగానమున
 మొయిలు దోనెలలోన బయనంబొనర్చి
 మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
 పాడుచు జీన్కునై పడిపోదునిలకు
 పక్షినయ్యెద జిన్ని ఋక్ష మయ్యెదను
 మధుపమయ్యెద జంద మామనయ్యెదను
 మేఘమయ్యెద వింత మెఱపు నయ్యెదను
 అలరు నయ్యెద జిగురాకు సయ్యెదను
 పాటనయ్యెద గొండ వాగునయ్యెదను
 పవనమయ్యెద వార్దిభంగమయ్యెదను" (కృష్ణపక్షం)

ఇవన్నీ అయోమయపు మాటలు. ఈ కృష్ణపక్షకర్తయిట్లా తుమ్మెదఅయి, మేఘమయి. గారడిచేస్తుంటే చూడవలెనని నేను కుతూహలపడుతున్నాను. కావ్యానందం లేకుంటే గారడీ ఆనందంతో నైనా తృప్తి పడతాను.

"ఓకుటిలపన్నగమ చెవియొగ్గివినుమ
 ఏను స్వేచ్ఛాకుమారుడ నేను గగన
 పథవిహారవిహంగమపతిని నేను