పుట:Neti-Kalapu-Kavitvam.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


అని యేకాంతసేవలోవున్నది యీ అయోమయ ప్పులుముడే నని ఇదివరకే నిరూపించాను.

"పెద్దపులినోటిలో నే నేను. పెనుబొబ్బపెడతాను నే నేను
 గొర్రెల్లెమేకల్లె నే నేను. ఘోషిల్లిపోతాను నే నేను
 భార్యనీవకచెంప నే నేను. భర్తనీవకచెంప నే నేను"
                                  (భారతి సం. 2, 11).

అనేవి యీఅయోమయపుకోటిలోనే చేరుతున్నవి. ఇది శంకరుల అద్వైతమా? వైయాకరణుల శబ్దబ్రహ్మవాదమా? లేదా జైమినీయమా? కాపిలమా? కాణాదమా? పాతంజలమా? గౌతమీయమా? స్వకీయ నూతనసిద్దాంతమా? యీబొబ్బలు పెట్టడమేమిటి; భార్యగావడమేమిటి; భర్తగావడమేమిటి; యీ అయోమయాన్ని యీకృతికర్తకే వదులుతున్నాను. ఇది స్వకీయసిద్దాంతమయితే దీనిని సుబోధంగా వ్యక్తపరచవలసి వుంటుంది. లేదా అయోమయంలోబడవేసి కృతికర్త అకృతార్దుడే అవుతున్నాడు.

"వినబడదు శ్రుతివాణి విప్పినవిధాన
 కనబడదుస్మృతి ఋషివచించిన విధాన." (భారతి.ధ్యానగీత),

అని ధ్యానగీతకర్త అంటాడు. శ్రుతివాణి విప్పిన విధానవినబడదంటే ఋగ్వేదంమొదటిరూపంతో లేదనా? మొదటి శ్రుతికారుడు చదివినట్లు నేటిబ్రాహ్మణుడు చదవలేడనా? లేదా వాట్లో ప్రక్షిప్తాలు చేరినవనా? యశ్రుతి? ఋగ్వేదమా? యజుర్వేదమా? అధర్వవేదమా? సామవేదమా? వాట్లో మంత్రభాగమా? బ్రాహ్మణభాగమా? యేవిప్రక్షిప్త భాగాలు? కాకుంటే ప్రథమంలో ఋగ్వేదం వినబడ్డట్లు ఇప్పుడు వినబడదనా? అయితే వేదం పుట్టినప్పటిధ్వని ఈధ్యానగీతకర్త యెప్పుడువిన్నాడు? ఇట్లానేస్మృతి. ఇవే అయోమయపునిస్సారపు మాట లంటున్నాను.

"వినబడియె నొక్కసూక్తి హృద్వివరమందు
 స్మృతులు మాని ముక్కోటిదేవతల వదలి