పుట:Garimellavyasalu019809mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలాపించవలసి వచ్చినది. జస్టీసు వర్గము వారికిని త్యాగరాజూల వ్రి నుండియే అలవాటైయుండుట చేతను ఇదివరకు తాముకోరుకొను చున్న ఉద్యోగము కండల మీదికి మారుపేతులు పెట్టుకొనిపీకు కొనుటకై వచ్చుచున్న ఈపగటి వేషగాండ్రను చూడగానే మఱియును యెదరి యెక్కువ గట్టిగా ఆ పాటలను పాడదొడగిరి.

   ఇట్లు యెల్ల పక్షములను నెదిరిపక్షమును దూషించుచు, తమ పక్షమున్ కీర్తించుచు ఎక్కడ యేలాగున వీలయితే అక్కడ ఆలాగున వోటులను కాకులవలె తన్నుకొని పోవుచుండుటయే వోటుల ప్రచారమై దేశీయుల శాంతప్రిశుద్ధ జెవనములెల్ల కుచ్చిత రనరంగములుగా  మారిపోయినవి. వాటినుండి మన చిత్తవృత్తులను మరలించుకొని, ప్రజలకు సత్యమును చూపించగల నిగ్రహశక్తికి మనము నముకొననిదే మన జాతీయాభివృద్ధి ప్రారంభముకాదు. ప్రస్తుతము దేశమందుకు సంసిద్ధముగ లేదూ జాతీయ్ నాయకులెల్ల రును శాసన సభలను ముట్టడించి వాటి ద్వారా యేవో యొకటి సాధించుమని గోరుచున్నారు. వారు యేదో యొక పక్షమున వోటర్లకు వోటు నీయక తీరదు. ఆవోటు కాంగ్రెసు కేండిదేటున కీయవలెననుట్కన్న సదుపదేశము నెవ్వరును చేయజాలరు. విశాల ఆశయములతోను, స్వేచ్చాపరత్వము నందును, ప్రభుత్వ ప్రతిఘటనధాటియందును, అచంచల విశ్వాసమునందును కాంగ్రెసు పార్టీ తక్కిన సముచిత్ జస్టిసుపార్టీనాయకులకంటె నెక్కువ యున్నతమైన స్థానము నాక్రమించుకొనుట కభ్యంతరమున్నదా?
-కృష్ణాపత్రిక, 25-9-1926