| శర్వాదు ల్నుతియింపలేనితఱి నీసౌందర్య మెంతోగదా | |
శా. | ఆర్వేలేండ్లు తపంబు చేసి భవదీయావాసశేషాద్రిపైఁ | |
శా. | తార్వాళంబులు వంచి చిత్తరుల వింత లముచ్చటైయుండఁగాఁ | |
శా. | కుర్వేరుం దమనంబు జాతిసుమముల్ గోరంట చేమంతులున్ | |
శా. | ఓర్వ న్శక్యమె యామ్యబాధ కటువై యుండ న్మనుష్యుం డిలం | |
జయంతి రామయ్య
కవిత్వవిమర్శనము
శ్రీమద్రామాయణమును జంపువుగా సంస్కృతభాషయందు రచించినకవి భోజరాజు. ఈ రాజకవి ధారానగరము రాజధానిగాఁ గల మాలవదేశమున క్రీ. శ. 1018 సం. మొదలుకొని 1060 వఱకు రాజ్యము చేసినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. కనుక నితఁడు క్రీ. శ. 1022 సం. మొదలు 1063 సం. వఱకు వేంగీదేశమును పాలించిన మనరాజరాజనరేంద్రునకు సమకాలికుఁడుగా నున్నాఁడు. ఇతఁడు సరస్వతీకంఠాభరణము, పాతంజలసూత్రవృత్తి మొదలగు గ్రంథములను రచించియుఁ బెక్కుపండితకవులకు నాశ్రయభూతుఁడై వారిచే బహుగ్రంథముల రచింపించియు సంస్కృతభాషను మహోన్నతికి దెచ్చెను.