పుట:Chanpuramayanam018866mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పతికవి క్రీ. 1700 ప్రాంతమం దుండె నని సిద్ధాంతీకరించుట కాక్షేప మేమియుఁ గనఁబడదు.

పద్మావతీపరిణయము నందుఁ గసవరాజు నుత్తరచరిత్ర మిట్లు వర్ణింపఁ బడినది :—

"కసవరాజపుత్రకుండై వయసునఁ జిన్నవాఁడైనను గుణములచేఁ బెద్దయు, వేంకటేశ్వరాంశసంభూతుండు నైన వేంకటపెరుమాళ్రా జనుచిన్నతమ్ముని రాజ్యతంత్రధురంధరుంగా నెంచి యతనియందు రాజ్యభార ముంచి నిస్పృహుఁ డై వానప్రస్థాశ్రమము నంగీకరించి భార్యతోఁ గూడ మునినికరముం జేరి వారిచెంతఁ గొండగుహయందు వసించి దుష్కరమగు తప మొనర్చుచుఁ గొంతకాల ముండి యంతటఁ దనకు మోక్షకాలము సమీపించినదని యెఱింగి నిజరాజధానియైన నారాయణపురమున కేగి యందున్న కల్యాణవేంకటేశ్వరుని యాలయములో ధ్వజస్తంభము చెంత భగవత్పాదములు స్మరించుచు బ్రహరంధ్రమునుండి ప్రాణమును విడిచెను." అని. చంపూరామాయణములోఁ గసవరాజునకు సింగరిరాజు, తిరువేంగళరాజు పెరుమాళ్రాజు ననువారు ముగ్గురే తమ్ము లుండినట్లు చెప్పఁబడినది. పద్మావతీపరిణయములో నీతనికి, తిరుమల రాజు, వేంకటపతిరాజు, చిన్నరాజునను మఱి ముగ్గురుతమ్ములుఁగూడ నుండిరనియు నీయార్గురిలో వేంకటపెరుమాళ్రాజు కడపటివాఁ డనియు నీతఁడే [1]కార్వేటినగరమును గట్టించెననియు, నంతకుఁ బూర్వము నారాయణపురమే రాజధానిగా నుండె ననియుఁ జెప్పఁబడియున్నది.

ఈగ్రంథము ప్రతియొక్కటే అత్తిరాలలో బ్ర. వెల్లాల చిన్నవేంకటసుబ్బయ్య సిద్ధాంతిగారివలన దొరకినది. దీని చివర "యతుల నారసింహ్వరాజు వ్రాసిన చంబూరామాయణం” అని యున్నది. ప్రత్యంతర మి తవఱకు దొరకలేదు. లేఖనదోషములుమాత్రము సవరించి వలసినపట్ల సంస్కృతచంపూరామాయణమునకు సరిచూచి మాకు దొరకిన ప్రతి ప్రకటించినారము.

వేంకటేశ్వరాష్టకములోనివి గ్రంథావతారికలో (పుట 4.) ముద్రింపఁబడిన మూడుపద్యములుగాక మిగిలిన యైదుపద్యములు నీ క్రిందఁ జేర్పఁబడినవి.

శా.

పర్వేందుప్రతిబింబవక్త్రము శరత్పద్మాక్షియుగ్మంబు కీ
రార్వశ్లాఘ్యధనుర్గుణాసహన సూనాకారనాసోన్నతిన్

  1. చంపూరామాయణములోఁ గార్వేటినగరప్రశంస యుండుటచే నీమాట సత్యము కాదని తేలుచున్నది.