పుట:Chanpuramayanam018866mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[ 5 ]

శూరున కెనమండ్రు కొడుకులు. వారిలో వేంకటాద్రినాయఁడు, వేంకటప్పనాయఁడు, చినవేంకటప్పనాయఁడు నను ముగ్గురు వేంకటాభిధాను లుండిరి. వీరిసోదరుఁడును రాజ్యభర్తయునైన కుమారయాచమనాయుఁడు మహిసూరువారితో యుద్ధము చేసి జయమంది "అబ్దుల్ ఫాదుషా" గారివలన బహుమానములు పొందినట్లు బ్ర. సదాశివశాస్త్రిగారు వ్రాసినారు. అబ్దుల్ ఫాదుషా యనఁగా అబ్దుల్ కుతుబ్ షా యను గోలకొండరాజు. ఈ రాజు క్రీ. 1611 మొదలు 1672 వఱకు రాజ్యము చేసెను. ఇదియుఁ జెంజి వరదప్పనాయనికాలమునకు సరిపోవుచున్నది. . యాచశూరునిసోదరులు కూడ నీకాలమువారే. వారు ముగ్గురిలో నెవ్వరో యొకరు చంపూరామాయణములోఁ బేర్కొనఁబడిన వెలుగోటి వేంకటవిభుఁడు కావలయును. ఈ ప్రమాణములు మూఁటిని బట్టి తిరువేంగళార్యుఁడు క్రీ. 1670-80 సంవత్సరములప్రాంతమువాఁ డైనట్లు తేలినది. ఆతని శిష్యుఁడైన వేంకటాచలపతికవి క్రీ. 1700 ప్రాంతమందుఁ గృతి నిర్మించుట యీకాలనిర్ణయమున కవిరోధమేకదా!

కవికాలనిర్ణయము చేయుట కింకొకయాధారము కూడఁగలదు. వేంకటాచలపతికవి దామర యక్కనృపాలుని సన్నిధికిం జని నప్పు డెవ్వరో "వరకవి గంధసింధురము" వచ్చె నటన్న "నేను గవిరాజకేసరి" నని కవి పల్కెనఁట. (చూ. ఆ. 1 ప. 34) ఈ యక్కనృపాలుఁ డెవ్వరో నిర్ణయింపవలసియున్నది. ధూర్జటి లింగకవి కృత [1]కాళహస్తిమాహాత్యమువలనఁ గాళహస్తిరాజవంశమం దక్కప్ప యనుపేరు గలవారు నలువు రున్నట్లు తెలియవచ్చుచున్నది. వారిలో మొదటివాఁడు చెన్నపట్టనమునకుఁ బేరొసంగిన చెన్నప్పనాయని రెండవకుమారుఁడు. ఈతఁడే ఉషాపరిణయగ్రంథకర్త. ఈయక్కప్పనాయని మనుమఁడుఁగూడ నక్కప్పయే. ఈ రెండవయక్కప్పకు, అక్కప్పయను కుమారుఁడును మనుమఁడును నమ్మక్కయను గూఁతురు నుండిరి. అమ్మక్క వెలుగోటి వీరకుమారయాచమనేని భార్యయై బంగరు యాచమనేనిం గనియెనఁట. ఈ బంగరు యాచమనీఁడు క్రీ. 1693 వ సంవత్సరమువఱకు సజీవుఁడైనట్లు వెలుగోటివారి వంశచరిత్రము చెప్పుచున్నది. కావున, బంగరు యాచమనేని మేనమామకుమారుఁడగు నాలుగవయక్కప్ప క్రీ. 1700 సంవత్సరప్రాంతమువాఁ డనియు వేంకటాచలపతికవికి సమకాలికుఁ డనియుఁ దేలుచున్నది. ఏవిధమునఁ జూచినను వేంకటాచల


  1. ఈ గ్రంథము వ్రాఁతప్రతి, యాంద్రసాహిత్యపరిషత్సుస్తకభాండాగారమునఁ జూడనగు.